ఏపీలో ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్

|

Apr 16, 2019 | 9:30 PM

అమరావతి: ఏపీలో ఐదు పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ జరగనుంది. గుంటూరు జిల్లాలో రెండు, నెల్లూరు జిల్లాలో రెండు, ప్రకాశం జిల్లాలో ఒక చోట రీపోలింగ్‌ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఈసీఐకు సిఫార్సు చేసింది. కాగా ఈ రాత్రికి రీపోలింగ్ తేదీని ఈసీఐ ప్రకటించనుంది. ఈసీఐ ప్రకటన అనంతరం వివి ప్యాట్ స్లిప్పులు, ఈవీఎంల తరలింపు పై అధికారులు చర్యలు తీసుకోనున్నారు. ఇకపోతే అటు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వీవీ ప్యాట్ స్లిప్పుల కలకలంపై ఈసీ సీరియస్ అయింది. […]

ఏపీలో ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్
Follow us on

అమరావతి: ఏపీలో ఐదు పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ జరగనుంది. గుంటూరు జిల్లాలో రెండు, నెల్లూరు జిల్లాలో రెండు, ప్రకాశం జిల్లాలో ఒక చోట రీపోలింగ్‌ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఈసీఐకు సిఫార్సు చేసింది. కాగా ఈ రాత్రికి రీపోలింగ్ తేదీని ఈసీఐ ప్రకటించనుంది. ఈసీఐ ప్రకటన అనంతరం వివి ప్యాట్ స్లిప్పులు, ఈవీఎంల తరలింపు పై అధికారులు చర్యలు తీసుకోనున్నారు. ఇకపోతే అటు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వీవీ ప్యాట్ స్లిప్పుల కలకలంపై ఈసీ సీరియస్ అయింది. ఆర్వో, ఏఆర్వో‌లపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఎన్నికల విధుల్లోని సిబ్బంది పొరపాట్లు చేస్తే శిక్ష తప్పదని ఎన్నికల సంఘం అధికారి గోపాలకృష్ణ ద్వివేది హెచ్చరించారు.