ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదించడంపై టీడీపీ తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తంచేస్తోంది. ఏపీ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లుల ఆమోదానికి నిరసనగా టీడీపీ నేత బీటెక్ రవి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపారు.