బాణాసంచా కాల్చారంటే భారీ జరిమానా, అమ్మితే మరింత ! రాజస్తాన్ లో కఠిన ఆంక్షలు

| Edited By: Pardhasaradhi Peri

Nov 14, 2020 | 8:30 PM

రాష్ట్ర ప్రజలు దీపావళిని ఆనందంగా జరుపుకోవాలని, కానీ బాణా సంచా కాల్చరాదని రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సూచించారు. ఎలాంటి ఫైర్ క్రాకర్స్ లేకుండా ప్రజలు దంతెరాస్, చోటీ దివాలీ..

బాణాసంచా కాల్చారంటే భారీ జరిమానా, అమ్మితే మరింత ! రాజస్తాన్ లో కఠిన ఆంక్షలు
Follow us on

రాష్ట్ర ప్రజలు దీపావళిని ఆనందంగా జరుపుకోవాలని, కానీ బాణా సంచా కాల్చరాదని రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సూచించారు. ఎలాంటి ఫైర్ క్రాకర్స్ లేకుండా ప్రజలు దంతెరాస్, చోటీ దివాలీ జరుపుకున్నారని, దీపావళిని కూడా అలాగే జరుపుకోవాలని ఆయన అన్నారు. బాణాసంచా అమ్మకాలపైన, కాల్చడంపైనా విధించిన నిషేధాన్ని ఆయన సమర్థించారు. కాగా ఈ ఆంక్షలను అతిక్రమించి ఎవరైనా క్రాకర్స్ కాలిస్తే రెండు వేల రూపాయలు, ఏ షాప్ కీపరైనా అమ్మితే 10 వేల రూపాయల జరిమానా విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాతావరణ కాలుష్యం పెరిగిపోతున్న కారణంగా ఈ కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. పైగా కరోనా వైరస్  మహమ్మారి కూడా ఉంది. బాణాసంచా కాల్చడం వల్ల వచ్ఛే పొగ కరోనా రోగులకు మరింత ప్రమాదాన్ని తెచ్చి పెడుతుందని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీ, చండీగఢ్, పశ్చిమ బెంగాల్ వంటి పలు రాష్ట్రాలు క్రాకర్స్ కాల్చినా, అమ్మినా జరిమానా తప్పదని  వీటిని నిషేధించాయి. మరికొన్ని రాష్ట్రాలు పాక్షిక నిషేధం విధించాయి.