పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బెయిల్!

| Edited By:

Jul 12, 2019 | 7:35 PM

అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంక్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బెయిల్ ముంజూరైంది. ఈ కేసును విచారణ సందర్భంగా రాహుల్ స్వయంగా కోర్టుకు హాజరయ్యారు. 15,000 పూచీకత్తుపై రాహుల్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఈ బ్యాంకు డైరెక్టర్లలో ఒకరు కావడం గమనార్హం. మోదీ ప్రభుత్వం నోట్ల రద్దు చేపట్టిన‌ అయిదు రోజుల తర్వాత అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంకులో 745.59 కోట్ల […]

పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బెయిల్!
Follow us on

అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంక్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బెయిల్ ముంజూరైంది. ఈ కేసును విచారణ సందర్భంగా రాహుల్ స్వయంగా కోర్టుకు హాజరయ్యారు. 15,000 పూచీకత్తుపై రాహుల్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఈ బ్యాంకు డైరెక్టర్లలో ఒకరు కావడం గమనార్హం.

మోదీ ప్రభుత్వం నోట్ల రద్దు చేపట్టిన‌ అయిదు రోజుల తర్వాత అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంకులో 745.59 కోట్ల నల్ల ధనాన్ని అసలైన నోట్లుగా మార్చుకున్నారని అమిత్‌షా, ఆ బ్యాంకు డైరెక్టర్‌ను ఉద్దేశిస్తూ రాహుల్ ట్వీట్ చేయడంతో రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు నమోదైంది. దీనికి సంబంధించిన ప్రాథమిక సాక్ష్యాధారాలు కూడా లభ్యం కావడంతో ఏప్రిల్ 9 తేదీన కోర్టు సమన్లు జారీ చేసింది. తమ బ్యాంకుపై రాహుల్ తప్పుడు ఆరోపణలు చేసి తమ ప్రతిష్ఠకు భంగం కలిగించారని అహ్మదాబాదు జిల్లా సహకార బ్యాంకు తన ఫిర్యాదులో పేర్కొంది. మరోవైపు తన సైద్ధాంతిక పోరాటం ముందుకెళ్లడానికి సహాయపడుతున్న ఆరెస్సెస్, బీజేపీకి రాహుల్ ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం తాను అహ్మదాబాదులో ఉన్నానని, రేపు మరో కేసులో మరో ప్రదేశంలో ఉంటానని అన్నారు. ‘సత్యమేవ జయతే’ అని రాహుల్ ఈ సందర్భంగా ట్వీట్ చేశారు.