సీఎంను కలిసిన సింధు: 5 ఎకరాల భూమి గిఫ్ట్..!

| Edited By:

Sep 13, 2019 | 12:21 PM

వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సచివాలయంలో కలుసుకున్నారు. సింధుకు గౌరవ ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు. సింధు తల్లిదండ్రులతో పాటు, మంత్రి అవంతి శ్రీనివాస్, శాప్ అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా.. సింధు, ఆమె తల్లిదండ్రులతో.. మాట్లాడారు జగన్. అలాగే.. భవిష్యత్తులో సింధు.. మరిన్ని విజయాలను సాధించాలని ప్రోత్సహించారు. వైజాగ్‌లో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు.. 5 ఎకరాల భూమి ఇచ్చేందుకు సీఎం అంగీకరించారు. ఈ సందర్భంగా.. పీవీ సింధు మాట్లాడుతూ.. […]

సీఎంను కలిసిన సింధు: 5 ఎకరాల భూమి గిఫ్ట్..!
Follow us on

వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సచివాలయంలో కలుసుకున్నారు. సింధుకు గౌరవ ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు. సింధు తల్లిదండ్రులతో పాటు, మంత్రి అవంతి శ్రీనివాస్, శాప్ అధికారులు ఉన్నారు.

ఈ సందర్భంగా.. సింధు, ఆమె తల్లిదండ్రులతో.. మాట్లాడారు జగన్. అలాగే.. భవిష్యత్తులో సింధు.. మరిన్ని విజయాలను సాధించాలని ప్రోత్సహించారు. వైజాగ్‌లో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు.. 5 ఎకరాల భూమి ఇచ్చేందుకు సీఎం అంగీకరించారు. ఈ సందర్భంగా.. పీవీ సింధు మాట్లాడుతూ.. జగన్‌ సార్‌ని కలిశా.. ఆయన నన్ను అభినందించారు.. చాలా సంతోషంగా ఉంది. అన్ని రకాల, సహాయ సహకారాలు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. అలాగే.. పద్మభూషణ్‌కి నాపేరు పరిశీలనలో ఉండటం చాలా సంతోషంగా ఉందన్నారు.