సోమ్‌నాథ్‌ ఆలయ ట్రస్ట్‌ ఛైర్మన్‌గా ప్రధాని నరేంద్ర మోదీ… ఏకగ్రీవంగా ఎన్నుకున్న ట్రస్ట్ సభ్యులు

|

Jan 19, 2021 | 6:13 AM

ప్రపంచ ప్రఖ్యాత సోమ్‌నాథ్‌ ఆలయ ట్రస్ట్‌ కొత్త ఛైర్మన్‌గా ప్రధాని నరేంద్ర మోదీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుజరాత్​లోని సోమనాథ్​ దేవాలయ ట్రస్ట్ ఛైర్మన్​గా​ ప్రధాని మోదీ నియమితులయ్యారు. గిర్‌ సోమనాథ్..

సోమ్‌నాథ్‌ ఆలయ ట్రస్ట్‌ ఛైర్మన్‌గా ప్రధాని నరేంద్ర మోదీ... ఏకగ్రీవంగా ఎన్నుకున్న ట్రస్ట్ సభ్యులు
Follow us on

PM Modi Appointed : ప్రపంచ ప్రఖ్యాత సోమ్‌నాథ్‌ ఆలయ ట్రస్ట్‌ కొత్త ఛైర్మన్‌గా ప్రధాని నరేంద్ర మోదీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుజరాత్​లోని సోమనాథ్​ దేవాలయ ట్రస్ట్ ఛైర్మన్​గా​ ప్రధాని మోదీ నియమితులయ్యారు. గిర్‌ సోమనాథ్‌ జిల్లాలోని ప్రభాస్‌ పటాన్‌ పట్టణంలో ఉన్న ఈ ప్రముఖ ఆలయ ట్రస్ట్‌కు ఇప్పటికే ట్రస్టీగా కొనసాగుతున్న మోదీని.. ఛైర్మన్‌గా ఎన్నుకున్నట్టు సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.

గత కొన్నేళ్ల పాటు ట్రస్టు ఛైర్మన్‌గా పనిచేసిన గుజరాత్‌ మాజీ సీఎం కేశూభాయ్‌ పటేల్‌ అక్టోబర్‌లో మరణించడంతో అప్పట్నుంచి ఈ స్థానం ఖాళీగా ఉంది. దీంతో ఆలయ ట్రస్టు 120వ సమావేశంను సోమవారం వర్చువల్‌ పద్ధతిలో నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ట్రస్ట్ సభ్యులు కొత్త ఛైర్మన్‌గా ప్రధాని మోదీని నియమించాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్టు ట్రస్టీ సెక్రటరీ పీకే లెహ్రీ వెల్లడించారు. ఈ ట్రస్టులో ఇతర ట్రస్టీలుగా బీజేపీ నేత ఎల్‌కే అద్వాని, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తదితరులు ఉన్నారు.