ముంబైలో ‘కోవిడ్ వార్డుల్లో’ రోగులకు సేవలందిస్తున్న డాక్టర్లలో చాలామందికి ఇతర సైడ్ ఎఫెక్ట్స్ సోకుతున్నాయని తెలిసింది. పీపీఈ కిట్లతో నిరంతరం పని చేయడమంటే మాటలు కాదని, ఊపిరి కూడా తీసుకోలేకపోతున్నామని వారంటున్నారు. ఒళ్ళంతా చెమటలు పడుతోందని, బరువు తగ్గిపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ముందుముందు ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ముంబైలో అనేకమంది పోలీసుల్లో పలువురు కోవిడ్ బారిన పడి మరణించగా.. డాక్టర్లు కూడా తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపలేకపోతున్నారు.