Driverless Train : దేశ చరిత్రలో మరో అద్భుతం..డ్రైవర్ లెస్ ట్రైయిన్ను ప్రారంభించిన ప్రధాని మోదీ
డ్రైవర్ లెస్ ట్రైయిన్ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఢిల్లీ మెట్రో రైలును ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా హాజరయ్యారు...
దేశ చరిత్రలో తొలిసారి లోకో పైలట్ రహిత మెట్రో ట్రైయిన్ ప్రారంభమైంది. డ్రైవర్ లెస్ ట్రైయిన్ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఢిల్లీ మెట్రో రైలును ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా హాజరయ్యారు.
ఈ డ్రైవర్ లెస్ ట్రైయిన్ను.. మాజెంటా లైన్లో జనక్పురి నుంచి బొటానికల్ గార్డెన్ వరకు 37 కిలోమీటర్ల మేర నడపనున్నారు. 2022లో మజ్లిస్ పార్క్ నుంచి శివ్ విహార్ మధ్య 57 కిలోమీటర్లు వరకు పొడిగించనున్నారు. దీంతో పాటు ప్రయాణికుల సౌకర్యార్థం పూర్తి స్థాయిలో పనిచేసే నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు(NCMC)ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ లైన్లో భాగంగా న్యూ దిల్లీ నుంచి ద్వారకా సెక్టార్ 21 వరకు ఉన్న 23 కిలోమీటర్ల పరిధిలో ఇది పనిచేస్తుంది.
ఢిల్లీ మెట్రోలోని పది కారిడార్లలో ఎన్సీఎంసీ మొదటిసారిగా వినియోగంలోకి రానుంది. ‘వన్ నేషన్-వన్ కార్డ్’ నినాదంలో భాగంగా దీనిని 2019 మార్చిలో ప్రధాని మోదీ ప్రారంభించారు.
The inauguration of the first driverless metro train shows how fast India is moving towards smart systems: PM Narendra Modi https://t.co/CYlAJfMTUZ pic.twitter.com/G3LnmJuYyh
— ANI (@ANI) December 28, 2020