రైతులకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రధాని మోదీ
ప్రధాని మోదీ మరో అద్భుతమైన పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు. రైతులకు మేలు చేసేందుకు భారీ స్కీమును ప్రవేశపెట్టబోతున్నారు. వ్యవసాయరంగాన్ని మరింత బలోపేతం చేసే చరిత్రాత్మక నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం, రూరల్ ఏరియాల్లో ఉద్యోగ అవకాశాలను పెంచే ఉద్దేశంతో కేంద్రం లక్ష కోట్లతో ‘అగ్రి ఇన్ఫ్రా ఫండ్’ ఏర్పాటు చేయనుంది. రేపు (ఆదివారం) ఉదయం 11 గం. లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పథకాన్ని ప్రదాని ప్రారంభించబోతున్నారు. ప్రధాని కిసాన్ యోజన పథకం […]
ప్రధాని మోదీ మరో అద్భుతమైన పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు. రైతులకు మేలు చేసేందుకు భారీ స్కీమును ప్రవేశపెట్టబోతున్నారు. వ్యవసాయరంగాన్ని మరింత బలోపేతం చేసే చరిత్రాత్మక నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం, రూరల్ ఏరియాల్లో ఉద్యోగ అవకాశాలను పెంచే ఉద్దేశంతో కేంద్రం లక్ష కోట్లతో ‘అగ్రి ఇన్ఫ్రా ఫండ్’ ఏర్పాటు చేయనుంది. రేపు (ఆదివారం) ఉదయం 11 గం. లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పథకాన్ని ప్రదాని ప్రారంభించబోతున్నారు.
ప్రధాని కిసాన్ యోజన పథకం కింద 8.5 కోట్ల మంది రైతులు లబ్ధిదారులుగా మారనున్నారు. ఈ పథకం 6వ విడతగా రూ. 17,000 కోట్లు విడుదల చేయనున్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం, రూరల్ ఏరియాల్లో ఉద్యోగ అవకాశాలను పెంచే ఉద్దేశంతో కేంద్రం లక్ష కోట్లతో ‘అగ్రి ఇన్ఫ్రా ఫండ్’ ఏర్పాటు చేయబోతోంది.
2029 వరకు అంటే.. రాబోయే పదేళ్ల పాటు ఈ ఫండ్ అమలులో ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఫార్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బూస్టప్ చేయడానికి, ప్రైవేటు పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ఈ ఫండ్ తోడ్పడుతుంది. ఫార్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు ఈ ఫండ్ నుంచి సబ్సిడీతో లోన్లు అందజేస్తారు. ప్రాథమిక వ్యవసాయ సంఘాలు, రైతు సంఘాలు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు, అగ్రి ఎంట్రప్రెన్యూర్లు, స్టార్టప్లు, వ్యవసాయ సంబంధ టెక్నాలజీ డెవలపర్లకు ఈ ఫండ్ ద్వారా సబ్సిడీపై లోన్లు అందజేస్తారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు కోల్డ్ స్టోరేజీలు, గిడ్డంగులు, ట్రాన్స్ఫోర్ట్ సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.