‘నన్ను ‘ఐటెం’ అన్నారుగా ! ఇప్పుడు చూడండి !’, ఇమర్తీ దేవి

మధ్యప్రదేశ్ ఉపఎన్నికల్లో దాబ్రా నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఇమర్తీ దేవి.. తన సమీప అభ్యర్థికన్నా ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

నన్ను ఐటెం అన్నారుగా ! ఇప్పుడు చూడండి !, ఇమర్తీ దేవి

Edited By:

Updated on: Nov 10, 2020 | 12:50 PM

మధ్యప్రదేశ్ ఉపఎన్నికల్లో దాబ్రా నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఇమర్తీ దేవి.. తన సమీప అభ్యర్థికన్నా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలి ఫలితాల ట్రెండ్ బీజేపీకి అనుకూలంగా వస్తుండడంతో ఇక ఆమె ‘వాయిస్ పెరిగింది’.’ రాష్ట్రంలో బీజేపీయే విజేత..ఇది తథ్యం.. నా పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కమల్ నాథ్ కు  ప్రజలు గట్టి బుధ్డి చెప్పారు’ అని ఆమె వ్యాఖ్యానించారు. (ఈ నియోజకవర్గం ఎస్ సి రిజర్వ్డ్ సీటు). ఇమర్తీ దేవిని ఉద్దేశించి కమల్ నాథ్ ‘ఐటమ్’ అని పేర్కొన్న సంగతి  విదితమే.