అప్పటివరకూ.. నేను జగన్‌ని పేరుపెట్టే పిలుస్తా..!

| Edited By:

Dec 01, 2019 | 7:26 PM

రాయలసీమ పర్యటనలో భాగంగా.. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన కొంతమందికే సీఎం అని.. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేంతవరకూ.. ఆయన్ని పేరు పెట్టే పిలుస్తానని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రైల్వే కోడూరు రైతులతో.. ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా.. పవన్ కళ్యాణ్.. మాట్లాడుతూ.. వైసీపీ పూర్తిగా.. ప్రత్యేక హోదా విషయం మర్చిపోయారని.. మాయమాటలు చెప్పి.. అధికారాన్ని సంపాదించారని మండిపడ్డారు. హోదా గురించి మోదీ […]

అప్పటివరకూ.. నేను జగన్‌ని పేరుపెట్టే పిలుస్తా..!
Follow us on

రాయలసీమ పర్యటనలో భాగంగా.. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన కొంతమందికే సీఎం అని.. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేంతవరకూ.. ఆయన్ని పేరు పెట్టే పిలుస్తానని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

రైల్వే కోడూరు రైతులతో.. ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా.. పవన్ కళ్యాణ్.. మాట్లాడుతూ.. వైసీపీ పూర్తిగా.. ప్రత్యేక హోదా విషయం మర్చిపోయారని.. మాయమాటలు చెప్పి.. అధికారాన్ని సంపాదించారని మండిపడ్డారు. హోదా గురించి మోదీ దగ్గర అడిగే ధైర్యం వైసీపీకి లేదని వ్యాఖ్యానించారు. ఆశయం కోసం పని చేసే వారికి గెలుపోటములతో సంబంధం లేదని అన్నారు. అందుకే తాము ఓడిపోయినా.. సరే.. ప్రజలు ఇప్పటికీ తమను ఆదరిస్తున్నారన్నారు.

జగన్‌కు భారతి సిమెంట్‌ పరిశ్రమపై ఉన్న శ్రద్ధ.. కడప ఉక్కు పరిశ్రమపై ఎందుకు లేదని.. ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాయలసీమ.. ఫ్యాక్షన్ గడ్డ కాదని.. చదువుల తల్లి అని ప్రస్తావించారు. వైఎస్ జగన్ రెడ్డి సీఎంలా మాట్లాడితే.. నేను కూడా ఆయనికి రెస్పక్ట్ ఇచ్చి మాట్లాడతానని సంభోదించారు. జగన్.. కొందమందికే సీఎంలా వ్యవహరిస్తున్నారని.. అందుకే ఆయన్ని పేరు పెట్టి పిలుస్తున్నానని తెలిపారు పవన్ కళ్యాణ్.