జూలైలో సెట్స్‌పైకి వెళ్లనున్న పవన్- క్రిష్ సినిమా.?

|

May 23, 2020 | 9:14 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీగా ‘వకీల్ సాబ్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈ చిత్రం తర్వాత పవన్ క్రిష్ డైరెక్షన్‌లో ఓ మూవీ చేస్తున్నారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కథాంశం పూర్తి కోహినూర్ వజ్రం చుట్టూ ఉంటుందని ఇండస్ట్రీ టాక్. మరోవైపు ఈ సినిమా బాలీవుడ్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండేజ్ లేదా కీర్తి సురేష్ నటించనున్నారని సమాచారం. […]

జూలైలో సెట్స్‌పైకి వెళ్లనున్న పవన్- క్రిష్ సినిమా.?
Follow us on

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీగా ‘వకీల్ సాబ్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈ చిత్రం తర్వాత పవన్ క్రిష్ డైరెక్షన్‌లో ఓ మూవీ చేస్తున్నారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కథాంశం పూర్తి కోహినూర్ వజ్రం చుట్టూ ఉంటుందని ఇండస్ట్రీ టాక్.

మరోవైపు ఈ సినిమా బాలీవుడ్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండేజ్ లేదా కీర్తి సురేష్ నటించనున్నారని సమాచారం. కరోనా కారణంగా టాలీవుడ్‌లో షూటింగులు ఆగిపోయిన విషయం విదితమే. ఈ నేపధ్యంలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ సడలింపులు ఇస్తుండటంతో జూలైలో ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లే ఛాన్సులు ఉన్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.