గురుగ్రామ్ లో ఆసుపత్రిపై రోగి బంధువుల దాడి, ట్రక్కుతో ఢీ కొట్టి, నానా విధ్వంసం, వీడియో సాక్షిగా

| Edited By: Pardhasaradhi Peri

Dec 20, 2020 | 3:19 PM

హర్యానాలోని గురుగ్రామ్ లో ఓ ఆసుపత్రిపై ట్రక్కుతో దాడి చేశారు ఇద్దరు రోగుల బంధువులు. ఈ వృధ్ధ రోగులకు చికిత్సపై ఒకే కుటుంబానికి చెందిన సభ్యుల మధ్య రేగిన వాగ్యుధ్ధం చిలికి చిలికి గాలివానగా..

గురుగ్రామ్ లో ఆసుపత్రిపై రోగి  బంధువుల దాడి,  ట్రక్కుతో ఢీ కొట్టి, నానా విధ్వంసం, వీడియో సాక్షిగా
Follow us on

హర్యానాలోని గురుగ్రామ్ లో ఓ ఆసుపత్రిపై ట్రక్కుతో దాడి చేశారు ఇద్దరు రోగుల బంధువులు. ఈ వృధ్ధ రోగులకు చికిత్సపై ఒకే కుటుంబానికి చెందిన సభ్యుల మధ్య రేగిన వాగ్యుధ్ధం చిలికి చిలికి గాలివానగా మారింది. దాంతో ఓ వ్యక్తి తన బంధువులతో కలిసి ట్రక్కులో వచ్చాడు. ఆ వాహనంతో ఆసుపత్రిపై కసిదీరా దాడి చేశాడు. ఏడెనిమిది సార్లు ట్రక్కుతో ఢీ కొట్టగా హాస్పిటల్ లోని పరికరాలు ధ్వంస మయ్యాయి. అతగాడు ఆగ్రహంతో అక్కడే ఉన్న మరికొన్ని వాహనాలను కూడా ఢీ కొట్టడంతో అవి దెబ్బ తిన్నాయి. ఇదంతా వీడియోకెక్కింది. . ఈ వ్యక్తి తాలూకు రోగులకు చికిత్స బాగానే అందుతోందని, అయితే వారి రెండు కుటుంబాల మధ్య తలెత్తిన గొడవతో ఆ వ్యక్తి ఈ బీభత్సానికి పాల్పడ్డాడని హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. ఈ ఘటనపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.   ఇక్కడి రోగులకు, ఆసుపత్రి స్టాఫ్ కు ఏదైనా జరిగిఉంటే అని అంతా ఆందోళన చెందారు.