TS High Court: హైకోర్టుకు చేరిన పఠాన్‌చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వివాదం.. పోలీసుల పట్టించుకోవడం లేదంటూ ఆరోపణ..

|

Dec 18, 2020 | 10:06 AM

పఠాన్‌చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వివాదం రాష్ట్ర హైకోర్టుకు చేరింది. జర్నలిస్టు సంతోష్ నాయక్‌ను చంపుతానంటూ బెదిరించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై

TS High Court: హైకోర్టుకు చేరిన పఠాన్‌చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వివాదం.. పోలీసుల పట్టించుకోవడం లేదంటూ ఆరోపణ..
Follow us on

పఠాన్‌చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వివాదం రాష్ట్ర హైకోర్టుకు చేరింది. జర్నలిస్టు సంతోష్ నాయక్‌ను చంపుతానంటూ బెదిరించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలైంది. ఈ పిటీషన్‌ను సంతోష్ నాయక్ దాఖలు చేశారు. ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్య వైఖరిని కనబరుస్తున్నారని సంతోష్ నాయక్ తన పిటీషన్‌లో ఆరోపించారు. పోలీసులు నామ మాత్రంగా కేసు నమోదు చేసి.. ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బెదిరింపులకు పాల్పడిన ఎమ్మెల్యేను వెంటనే అరెస్ట్ చేసేలా ఆదేశించి, తనకు న్యాయం చేయాలని కోర్టును సంతోష్ నాయక్ కోరాడు. సంతోష్ పిటీషన్‌ను హైకోర్టు నేడు విచారించనుంది. కాగా, తనపై కథనాలు రాశాడనే కారణంగా జర్నలిస్ట్ సంతోష్ నాయక్‌ను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బెదిరించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆయనపై ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును పోలీసులు నమోదు చేశారు.