జమ్ముకశ్మీర్ : భారత్, పాక్ సరిహద్దుల్లో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. పాక్ కవ్వింపు చర్యలకు సోమవారం భారతసైన్యం ధీటుగా సమాధానం ఇచ్చింది. నియంత్రణ రేఖవద్ద భారత భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని పాక్ సైన్యం కాల్పులకు దిగింది. దీంతో భారత జవాన్లు ఎదురు కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ముగ్గురు పాకిస్థాన్ సైనికులు మృతి చెందారు. దీనిపై పాకిస్థాన్ ఆర్మీ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. కాగా పాక్ కాల్పుల్లో బీఎస్ఎఫ్కి చెందిన ఇన్స్పెక్టర్, ఓ ఐదేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు స్థానికులు తీవ్రంగా గాయపడ్డారు.