ప్రతిపక్షాలు లేకుండా రెండు రోజుల్లో 15 బిల్లులను రాజ్యసభ ఆమోదించింది. ఆదివారం నాడు సభలో పెద్దఎత్తున గందరగోళం జరగడం, ఎనిమిది మంది రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్, ఉభయ సభలను విపక్షాలు బాయ్ కాట్ చేయడం, ఈ సెషన్ లో ముఖ్య ఘటనలు.కాగా-నిన్న ఏడు బిల్లులను, బుధవారం ఎనిమిది బిల్లులను సభ ఆమోదించింది. వీటిలో మూడు వివాదాస్పదమైన లేబర్ బిల్లులుఉన్నాయి…., వీటిని ఆర్ ఎస్ ఎస్ సహా పలు కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని తెలుస్తోంది. అటు-ఎనిమిది మంది ఎంపీల సస్పెన్షన్ విచారకరమని, కానీ తప్పనిసరైందని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. అలాగే విపక్షాలు ఉభయ సభలను బాయ్ కాట్ చేయడాన్ని కూడా ఆయన ఆక్షేపించారు.