సినీ నటుడు మోహన్ బాబుకు ఏడాది జైలు శిక్ష

| Edited By:

Apr 02, 2019 | 1:44 PM

ప్రముఖ నటుడు, వైసీపీ నేత మోహన్‌బాబుకు ఏడాది జైలు శిక్ష విధించింది హైదరాబాద్ ఎర్రమంజిల్ కోర్టు. చెక్‌బౌన్స్ కేసులో భాగంగా మోహన్‌బాబుకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ. 41.75 లక్షలు జరిమాన విధించింది కోర్టు. 2010లో వైవీఎస్ చౌదరి వేసిన చెక్‌బౌన్స్ కేసులో కోర్టు ఈ తీర్పు వెలువరించింది. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో ‘సలీం’ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ సందర్భంగా రూ.40.50 లక్షల చెక్కును నిర్మాత మోహన్ బాబు దర్శకుడికి అందించారు. […]

సినీ నటుడు మోహన్ బాబుకు ఏడాది జైలు శిక్ష
Follow us on

ప్రముఖ నటుడు, వైసీపీ నేత మోహన్‌బాబుకు ఏడాది జైలు శిక్ష విధించింది హైదరాబాద్ ఎర్రమంజిల్ కోర్టు. చెక్‌బౌన్స్ కేసులో భాగంగా మోహన్‌బాబుకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ. 41.75 లక్షలు జరిమాన విధించింది కోర్టు. 2010లో వైవీఎస్ చౌదరి వేసిన చెక్‌బౌన్స్ కేసులో కోర్టు ఈ తీర్పు వెలువరించింది. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో ‘సలీం’ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ సందర్భంగా రూ.40.50 లక్షల చెక్కును నిర్మాత మోహన్ బాబు దర్శకుడికి అందించారు. అయితే.. ఆ చెక్ బౌన్స్ అవడంతో.. కోర్టును ఆశ్రయించారు వైవీఎస్ చౌదరి. అప్పటి నుంచి ఈ కేసుపై విచారణ జరుగుతుండగా.. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మంగళవారం కోర్టు తుదితీర్పును వెలువరించింది. ఈ కేసుకు సంబంధించి బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశాడు మోహన్ బాబు.