అమీర్‌పేటలో ఘోర రోడ్డుప్రమాదం.. అదుపుతప్పిన బైక్.. మెట్రో స్టేషన్‌ రైలింగ్‌లో ఇరుక్కుని యువకుడి మృతి

|

Dec 11, 2020 | 10:08 AM

హైదరాబాద్ మహానగరంలోని అమీర్‌పేట చౌరస్తాలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అదుపుతప్పిన బైక్ మెట్రో స్టేషన్‌ రైలింగ్‌కు ఢీకొని ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు.

అమీర్‌పేటలో ఘోర రోడ్డుప్రమాదం.. అదుపుతప్పిన బైక్.. మెట్రో స్టేషన్‌ రైలింగ్‌లో ఇరుక్కుని యువకుడి మృతి
Follow us on

హైదరాబాద్ మహానగరంలోని అమీర్‌పేట చౌరస్తాలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అదుపుతప్పిన బైక్ మెట్రో స్టేషన్‌ రైలింగ్‌కు ఢీకొని ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఖైరతాబాద్ వైపు నుంచి ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై అతి వేగంతో కూకట్‌పల్లి వైపు బయల్దేరారు. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అంబేడ్కర్‌ చౌరస్తా వద్దకు రాగానే బైక్ అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. దీంతో ఇద్దరు యువకులు మెట్రో స్టేషన్‌ రైలింగ్‌ను ఢీకొన్నారు. ఈఘటనలో యువకుడి తల మెట్రో స్టేషన్‌ రైలింగ్‌లో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ యువకుడిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు