బియ్యం కార్డుదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..

ఏపీలో రెవెన్యూశాఖ మంత్రిగా ధర్మాన కృష్ణదాస్ బాధ్యతలు చేపట్టారు. ఆదాయ ధృవీకరణ పత్రాల కాలపరిమితిని నాలుగేళ్లకు పెంచుతూ ఆయన తొలి ఫైల్‌పై సంతకం చేశారు. అంతేకాకుండా బియ్యం కార్డుదారులకు కూడా గుడ్ న్యూస్ చెప్పారు.

బియ్యం కార్డుదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..

Updated on: Jul 25, 2020 | 3:15 PM

No Need Of Income Certificate For Biyyam Card Holders: ఏపీలో రెవెన్యూశాఖ మంత్రిగా ధర్మాన కృష్ణదాస్ బాధ్యతలు చేపట్టారు. ఆదాయ ధృవీకరణ పత్రాల కాలపరిమితిని నాలుగేళ్లకు పెంచుతూ ఆయన తొలి ఫైల్‌పై సంతకం చేశారు. అంతేకాకుండా బియ్యం కార్డుదారులకు కూడా గుడ్ న్యూస్ చెప్పారు. ఇకనుంచి వారికి ఆదాయ ధృవీకరణ పత్రం అవసరం లేదని.. బియ్యం కార్డే.. ఇన్‌కమ్‌ సర్టిఫికేట్ అని స్పష్టం చేశారు.

భూవివాదాలను పరిష్కరించేందుకు ఫ్రెండ్లీ రెవెన్యూ వ్యవస్థకు శ్రీకారం చుడతామని తెలిపారు. ప్రజలకు మరింత అందుబాటులో ఉండే విధంగా రెవెన్యూ సేవలను ఇక నుంచి గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, అర్హులైన లబ్దిదారులకు ఆగష్టు 15న ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వెల్లడించారు.

Also Read:

కోవిడ్ మరణాలు తగ్గించేందుకు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

ఏపీ: ఇంటర్ విద్యలో మార్పులు.. అభిప్రాయాల సేకరణ..

 ‘పేరు’ కోసమే సుశాంత్ ప్రయత్నించాడు..అనురాగ్ కశ్యప్ సంచలన వ్యాఖ్యలు..

‘దిల్ బేచారా’ మూవీ రివ్యూ… కంటతడి పెట్టిన సుశాంత్ యాక్టింగ్..