AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్ర‌యాణ ఆంక్ష‌ల‌ను ఎత్తివేసిన క‌ర్ణాటక సర్కార్

కర్ణాటక సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్కడ నుంచైనా ఇప్పుడు రాష్ట్రంలో ప్రవేశించే వారికి ఎలాంటి క్వారంటైన్..టెస్ట్ లు ఉండవని స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా, మార్చిలో విధించిన ప్రయాణ ఆంక్షల్లో మరింటిని కర్ణాటక ప్రభుత్వం సవరించింది.

ప్ర‌యాణ ఆంక్ష‌ల‌ను ఎత్తివేసిన క‌ర్ణాటక సర్కార్
Balaraju Goud
|

Updated on: Aug 25, 2020 | 3:20 PM

Share

కర్ణాటక సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్కడ నుంచైనా ఇప్పుడు రాష్ట్రంలో ప్రవేశించే వారికి ఎలాంటి క్వారంటైన్..టెస్ట్ లు ఉండవని స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా, మార్చిలో విధించిన ప్రయాణ ఆంక్షల్లో మరింటిని కర్ణాటక ప్రభుత్వం సవరించింది. అన్ని రాష్ట్రాల నుంచి ప్రయాణికులపై ఏ విధమైన ఆంక్షలూ ఉండబోవని, సరిహద్దుల్లో కేవలం స్క్రీనింగ్ మాత్రమే జరుగుతుందని, 14 రోజుల తప్పనిసరి క్వారంటైన్ నిబంధనను తొలగిస్తున్నామని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ఫ్యామిలీ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి జావేద్ అఖ్తర్ ఉత్తర్వులు జారీ చేశారు. రెండు రోజుల క్రితం కేంద్ర హోమ్ శాఖ నుంచి అందిన ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. ఇకపై కర్ణాటక రాష్ట్రానికి వచ్చే వారు సేవా సింధు పోర్టల్ లో నమోదు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదని ఆయన స్పష్టం చేశారు.

సవరించిన నిబంధనలు అన్ని రాష్ట్రాల వారికీ వర్తిస్తాయని, వ్యాపారపరమైన పనుల నిమిత్తం వచ్చేవారు, విద్యార్థులు, ఉపాధి కోసం వచ్చే కార్మికులు ఇకపై నిరభ్యంతరంగా రావచ్చని కర్నాటక ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు మాత్రం ఇవి వర్తించవని, వారు క్వారంటైన్ తప్పనిసరిగా ఉండాల్సిందేనని జావేద్ అఖ్తర్ తెలిపారు. ఈ మేరకు వివిధ రాష్ట్రాలతో సరిహద్దులను పంచుకుంటున్న అన్ని జిల్లాల అధికారులకూ సమాచారాన్ని పంపామని ఆయన అన్నారు.