రైతులకు బేడీల ఘటనపై స్పందించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ

|

Nov 08, 2020 | 5:06 PM

అమరావతి రైతులకు బేడీలు వేసిన ఘటనలో ఏపీసీఎల్ఏ అధ్యక్షుడి ఫిర్యాదుపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ స్పందించింది.   8 వారాల్లో చర్యలు తీసుకోవాలని సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్​ని ఎన్‌హెచ్‌ఆర్‌సీ  ఆదేశించింది.

రైతులకు బేడీల ఘటనపై స్పందించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ
Follow us on

అమరావతి రైతులకు బేడీలు వేసిన ఘటనలో ఏపీసీఎల్ఏ అధ్యక్షుడి ఫిర్యాదుపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ స్పందించింది.   8 వారాల్లో చర్యలు తీసుకోవాలని సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్​ని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశించింది. రైతులకు బేడీలు సహా పలు అంశాలపై ఎన్‌హెచ్‌ఆర్‌సీని ముప్పాళ్ల సుబ్బారావు ఆశ్రయించారు.

ఏం జరిగిందంటే :

ఈ నెల 24వ తేదీన గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంకు చెందిన 11మందిని పోలీసులు అరెస్టు చేశారు. కరోనా టెస్టులు చేసిన అనంతరం వారిలో ఏడుగురిని  నరసరావుపేట జైలు నుంచి ఆర్టీసీ బస్సులో గుంటూరు జిల్లా జైలుకు తీసుకువచ్చారు. అయితే రైతుల చేతులకు బేడీలు వేసి తీసుకురావడం కలకలం రేపింది. ప్రతిపక్షాలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి.

Also Read :

దిండు కింద ఫోన్‌ పేలి వ్యక్తికి తీవ్ర గాయాలు

రెండోసారి కరోనా సోకి కడప డాక్టర్ మృతి

జనవరి ఫస్ట్ నుంచి అన్ని వాహనాలకు ఫాస్టాగ్ మస్ట్