రియాలిటీ షో విజేతకు అంతరిక్ష యాత్ర చేసే ఛాన్స్‌!

|

Sep 21, 2020 | 6:31 PM

టీవీలలో బోలెడన్నీ రియాలటీ షోలు ప్రసారం అవుతున్నాయి.. వాటిని చూసేవాళ్లు కూడా ఎక్కువే.. వాటిల్లో పార్టిసిపేట్‌ చేసేవారికి కూడా బాగానే గిట్టుబాటు అవుతోంది.. ఇక విజేతకైతే భారీ నగదు బహుమతే ఉంటుంది..

రియాలిటీ షో విజేతకు అంతరిక్ష యాత్ర చేసే ఛాన్స్‌!
Follow us on

టీవీలలో బోలెడన్నీ రియాలటీ షోలు ప్రసారం అవుతున్నాయి.. వాటిని చూసేవాళ్లు కూడా ఎక్కువే.. వాటిల్లో పార్టిసిపేట్‌ చేసేవారికి కూడా బాగానే గిట్టుబాటు అవుతోంది.. ఇక విజేతకైతే భారీ నగదు బహుమతే ఉంటుంది.. ఇవన్నీ కాదు కానీ.. రియాలిటీ షోలో గెలిచినవారిని అంతరిక్ష యాత్రకు పంపిస్తామంటోంది ఓ ప్రొడక్షన్‌ కంపెనీ.. స్పేస్‌ హీరో ఇన్‌కార్పొరేషన్‌ అనే అమెరికాకు చెందిన ఆ కంపెనీ త్వరలో స్పేస్‌ హీరో అన్న పేరుతో ఒక రియాలిటీ షోను స్టార్ట్‌ చేయబోతున్నది.. రియాలిటీ షో అనౌన్స్‌మెంట్‌ అయితే చేసింది కానీ ఆ ప్రొగ్రామ్‌ ఎలా ఉంటుందన్నది మాత్రం చెప్పలేదు.. అయితే 2023లో ప్రారంభమయ్యే ఈ షోలో గెలిచిన వారిని మాత్రం రోదసికి పంపిస్తామని చెబుతోంది.. అంతరిక్ష యాత్ర చేయాలన్న ఆసక్తి ఉన్నవారు అప్లయ్‌ చేసుకోవచ్చంటోంది.. సపోజ్‌ పర్‌ సపోజ్‌ వారు విజేతగా నిలిస్తే అంతరిక్షంలో ఉండగలరా అన్నది పరీక్షలతో తేలుస్తారట! అంటే ఫిజికల్‌గా మెంటల్‌గా ఎంత స్ట్రాంగ్‌ ఉన్నారన్నది కనిపెడతారన్నమాట. రియాలిటీ షోలో వారు కనబర్చిన పర్‌ఫార్మెన్స్‌, ఆర్డియన్స్‌ పోల్‌లో వచ్చిన ఓట్ల ఆధారంగా విజేతను డిసైడ్‌ చేస్తారు.. గెలిచినవారిని ఓ పది రోజుల పాటు అంతరిక్ష యాత్రకు పంపిస్తారు.. యాత్రలో భాగంగా రాకెట్‌లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లి .. అక్కడ ఓ పది రోజులు గడిపేసి తిరిగి భూమి మీదకు వస్తారు. ఇందుకోసం ప్రైవేటు స్పేస్‌ మిషన్‌ సంస్థ యాక్సివోమ్‌ స్పేస్‌తో స్పేస్‌ హీరో ఒప్పందం కుదుర్చుకుంది. వీలైనంత తొందరలో నాసాతో సంప్రదింపులు జరుపుతారట! ఆ తర్వాతే రియాలిటీ షో పూర్తి వివరాలు చెబుతామంటోంది స్పేస్‌ హీరో ఇన్‌ కార్పొరేషన్‌ సంస్థ..