AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ వ్యవసాయరంగంలో పెను మార్పులు: జగన్ డెసిషన్ ఇదే

ఏపీలో వ్యవసాయరంగాన్ని సమూలంగా మార్చేందుకు రెడీ అయ్యారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. విప్లవాత్మక మార్పుల దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వివిధ అంశాల్లో విజ్ఞానమార్పిడి, శిక్షణ కోసం 11 జాతీయ ప్రఖ్యాత సంస్థలతో సోమవారం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ సంస్థలతో కుదిరిన అవగాహన ఒప్పందాలతో వైయస్సార్‌ రైతు భరోసా కేంద్రాలకు పూర్తి సాంకేతిక పరిఙ్ఞానం అందనున్నది. ఈ మేరకు సీఎం క్యాంపు కార్యాలయంలో పలు అగ్రిమెంట్లపై అధికారులు సంతకాలు చేశారు. చెన్నైలోని ఎంఎస్‌ […]

ఏపీ వ్యవసాయరంగంలో పెను మార్పులు: జగన్ డెసిషన్ ఇదే
Rajesh Sharma
|

Updated on: Feb 10, 2020 | 1:42 PM

Share

ఏపీలో వ్యవసాయరంగాన్ని సమూలంగా మార్చేందుకు రెడీ అయ్యారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. విప్లవాత్మక మార్పుల దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వివిధ అంశాల్లో విజ్ఞానమార్పిడి, శిక్షణ కోసం 11 జాతీయ ప్రఖ్యాత సంస్థలతో సోమవారం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ సంస్థలతో కుదిరిన అవగాహన ఒప్పందాలతో వైయస్సార్‌ రైతు భరోసా కేంద్రాలకు పూర్తి సాంకేతిక పరిఙ్ఞానం అందనున్నది.

ఈ మేరకు సీఎం క్యాంపు కార్యాలయంలో పలు అగ్రిమెంట్లపై అధికారులు సంతకాలు చేశారు. చెన్నైలోని ఎంఎస్‌ స్వామినాథన్‌ ఫౌండేషన్, న్యూఢిల్లీలోని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్, న్యూఢిల్లీలోని సాయిల్‌ సైన్స్‌ డివిజన్, హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాంట్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్, ఫరీదాబాద్‌లోని సెంట్రల్‌ ఫెర్టిలైజర్‌ క్వాలిటీ కంట్రోల్‌ మరియు శిక్షణ సంస్థ, వారణాసిలోని నేషనల్‌ సీడ్‌ రీసెర్చ్‌ మరియు శిక్షణ సంస్థ, హైదరాబాద్‌లోని సెంట్రల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ డ్రైల్యాండ్‌ అగ్రికల్చర్, కర్నాల్‌లోని నేషనల్‌ డెయిరీ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ , ఇండియన్‌ వెటర్నరీ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్, బెంగుళూరుకు చెందిన సదరన్‌ రీజినల్‌ యానిమల్‌ డిసీజ్‌ డయాగ్నోస్టిక్‌ ల్యాబ్‌ మరియు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ యానిమల్‌ హెల్త్‌ అండ్‌ వెటర్నరీ బయోలాజికల్స్, ఐసీఏఆర్‌ – సీఐఎఫ్‌ఏ సంస్థలతో ఏపీ ప్రభుత్వం తాజాగా అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసింది.

ఈ సంస్థలు అందించే సాంకేతిక, సమాచార పరిఙ్ఞానంతో రాష్ట్రంలో వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కుతుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. స్వామినాథన్ సిఫారసులను గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆయన ఆరోపించారు.

Follow Us
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..