National Permit: ఇకపై ఆ వాహనాలకు అన్ని రాష్ట్రాల్లో ఒకే రుసుము.. ఈ విధానం అమల్లోకి వస్తే…

|

Jan 19, 2021 | 7:17 AM

National Permit Of Tourist Vehicles: టూరిజం కోసం ఉపయోగించే వాహనాలకు మేలు చేసేందుకుగాను కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం ట్రక్కులకు, భారీ వాహనాలకు అమలు చేస్తున్న వన్‌టైం జాతీయ పర్మిట్‌ వార్షిక రుసుం విధానాన్నే..

National Permit: ఇకపై ఆ వాహనాలకు అన్ని రాష్ట్రాల్లో ఒకే రుసుము.. ఈ విధానం అమల్లోకి వస్తే...
Follow us on

National Permit Of Tourist Vehicles: టూరిజం కోసం ఉపయోగించే వాహనాలకు మేలు చేసేందుకుగాను కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం ట్రక్కులకు, భారీ వాహనాలకు అమలు చేస్తున్న వన్‌టైం జాతీయ పర్మిట్‌ వార్షిక రుసుం విధానాన్నే పర్యాటక వాహనాలకు అమలు చేయనుంది. ఒక వేళ ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఒకే రకమైన రుసుములు ఉండనున్నాయి.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, గుజరాత్‌, కర్ణాటక రాష్ట్రాలు పర్యాటక వాహనాల నుంచి అత్యధిక రుసుములు వసూలు చేస్తున్నాయి. కొత్త విధానం అమల్లోకి వస్తే ఆయా రాష్ట్రాల్లో ఈ ట్యాక్స్‌ 50 శాతం మేర తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక ఈ కొత్త విధానానికి సంబంధించి విడుదల చేసిన ముసాయిదాకు ఏ రాష్ట్రమూ అభ్యంతరం చెప్పలేదని సమాచారం. ‘ఇకపై పర్యాటక వాహనాలకు అన్ని రాష్ట్రాల్లో ఒకే రుసుము ఉంటుంది. అది సదరు వాహన సామర్థ్యం బట్టి నిర్ణయిస్తారని’ అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా అంతర్‌-నగర ప్రయాణాలకు ప్రేవేటు వాహనాల కంటే వాణిజ్య వాహనాలనే ప్రజలు ఎక్కువగా వాడే అవకాశం ఉందని మంత్రిత్వశాఖ అంచనా వేస్తోంది.

Also Read: సోమ్‌నాథ్‌ ఆలయ ట్రస్ట్‌ ఛైర్మన్‌గా ప్రధాని నరేంద్ర మోదీ… ఏకగ్రీవంగా ఎన్నుకున్న ట్రస్ట్ సభ్యులు