మధ్యప్రదేశ్ బై పోల్స్, ఆధిక్యంలో బీజేపీ, రెండో స్థానంలో కాంగ్రెస్

మధ్యప్రదేశ్ లో 28 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ 18 స్థానాల్లో, కాంగ్రెస్ 9 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఈ బై పోల్స్ ముఖ్యంగా బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియాకు అగ్నిపరీక్షే ! 

మధ్యప్రదేశ్ బై పోల్స్, ఆధిక్యంలో బీజేపీ, రెండో స్థానంలో కాంగ్రెస్

Edited By:

Updated on: Nov 10, 2020 | 12:23 PM

మధ్యప్రదేశ్ లో 28 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ 18 స్థానాల్లో, కాంగ్రెస్ 9 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఈ బై పోల్స్ ముఖ్యంగా బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియాకు అగ్నిపరీక్షే !  గత మార్చిలో 22 మంది ఎమ్మెల్యేలతో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. దీంతో కాంగ్రెస్ నేత, అప్పటి సీఎం కమల్ నాథ్ ప్రభుత్వం కుప్పకూలింది. ఫలితాలు వెల్లడవుతుండగా కమల్ నాథ్ ఈ ఉదయం భోపాల్ లో హనుమాన్ ఆలయానికి వెళ్లి పూజలు చేశారు.

ఇక బీహార్ లో వాల్మీకి నగర్ లోక్ సభ నియోజకవర్గానికి జరిగిన  ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. గుజరాత్ లో 8 సీట్లకు గాను బీజేపీ 7, కాంగ్రెస్ పార్టీ ఒకచోట లీడ్ లో ఉన్నాయి. కర్నాటకలో బైపోల్స్ జరిగిన 2 చోట్ల బీజేపీ ముందంజలో ఉండగా .. మణిపూర్ లో 5 సీట్లకు గాను ఒకచోట కూడా  బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఒడిశాలో రెండు సీట్లకు గాను బీజేడీ, ఇతరులు ఆధిక్యంలో ఉన్నారు. ఛత్తీస్ గడ్ లో ఒక సీటుకు బై పోల్ జరగగా.. కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది.

 

Loading...
Unable to load recommendations.
Follow Us