గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజని తన పెద్ద మనసును మరోసారి చాటుకున్నారు. చిలకలూరిపేట పట్టణంలోని అడ్డరోడ్డు సెంటర్ లో సుభాని నగర్ కు చెందిన అరిగేళ్ల భాషా (ఎలక్ట్రీషియన్) రోడ్డు దాటుతుండగా అతడ్ని టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భాషాకు తీవ్రగాయాలయ్యాయి. రాత్రివేళ అదే సమయంలో అటుగా వెళుతున్న రజిని హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని భాషాను పోలీసుల సాయంతో హాస్పిటల్ కి తరలించారు.