మళ్లీ గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ట్రబుల్‌ షూటర్‌..తనదైన స్టయిల్లో పని మొదలు పెట్టాడు

|

Nov 23, 2020 | 9:52 PM

ఓటమి ఎరుగని ట్రబుల్‌ షూటర్‌ రగిలిపోతున్నాడు. ప్రతీకారం కోసం కసిగా పనిచేస్తున్నాడు. ఆయనే టీఆర్‌ఎస్‌ నేత, ఆర్థికమంత్రి హరీష్‌రావు. దుబ్బాకలో కారును దెబ్బతీసిన బీజేపీని- గ్రేటర్‌ ఎన్నికల్లో దెబ్బకుదెబ్బ తీయాలని ఆర్థికమంత్రి హరీష్‌రావు పట్టుదలతో ఉన్నారు...

మళ్లీ గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ట్రబుల్‌ షూటర్‌..తనదైన స్టయిల్లో పని మొదలు పెట్టాడు
Follow us on

Minister Harish Rao Entry : టీఆర్‌ఎస్‌ పుట్టినప్పటినుంచి కేసీఆర్‌ వెన్నంట నిలిచి, ఆ పార్టీ మూలస్తంభాల్లో ఒకరైన హరీష్‌రావుకు రాజకీయ జీవితంలో ఓడిపోవడం తెలియని నాయకుడు. అలాంటి హరీష్‌రావును దుబ్బాక ఓటమి కుదుపు కుదిపింది.

దుబ్బాక ఓటమిని మైండ్‌ నుంచి తీసేయాలని కేసీఆర్‌ చెప్పిన నేపథ్యంలో- ఈ ట్రబుల్‌ షూటర్‌ మళ్లీ గ్రౌండ్‌లోకి వచ్చారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో- సంగారెడ్డి జిల్లాలోని మూడు డివిజన్లు ఉన్నాయి. పటాన్‌చెరు, భరత్‌నగర్‌, రామచంద్రాపురంలో ఆర్థికమంత్రి హరీష్‌రావు- టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు కోసం తనదైన స్టయిల్లో పనిచేస్తున్నారు.

టికెట్లు ఆశించి భంగపడ్డవారు- బీజేపీలోకి వెళ్లకుండా బుజ్జగిస్తున్నారు. బీజేపీలో చేరిన ఒక సిట్టింగ్‌ కార్పొరేటర్‌ను మళ్లీ టీఆర్‌ఎస్‌లో చేరేలా సక్సెస్‌ అయ్యారు. హైదరాబాద్‌కు నిధులు ఇవ్వని బీజేపీ- హైదరాబాద్‌లో అడ్డం పొడవూ మాట్లాడుతున్నారంటూ విమర్శించారు.

సంగారెడ్డి జిల్లాలోని మూడు డివిజన్లలో పనిచేసేందుకు- గజ్వేల్‌, ఆందోల్‌, సిద్దిపేట, సంగారెడ్డి నియోజకవర్గాల నేతల సేవలను ఉపయోగించుకుంటున్నారు. దుబ్బాక పరాజయంతో నేర్చుకున్న పాఠాలను గుర్తించుకుని- గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీకి చుక్కలు చూపించాలని హరీష్‌రావు గట్టి సంకల్పంతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో హరీష్‌ ప్రచారం చేస్తున్నచోట- బీజేపీ సాధించే ఓట్లెన్ని అన్న పాయింట్‌ ఇంట్రస్టింగ్‌గా మారింది.