Metro To Tirumala: ఏపీ వాసులకు శుభవార్త.. త్వరలోనే తిరుమలకు మెట్రో.!

|

Feb 26, 2020 | 6:45 AM

తిరుపతి నుంచి తిరుమల కొండపైకి మెట్రో విషయంపై మూడు రోజులు సర్వే చేశామన్నారు. తిరుమల మొత్తం రిజర్వ్ ఫారెస్ట్ కింద డిక్లేర్ కావడంతో కాలుష్యం తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు...

Metro To Tirumala: ఏపీ వాసులకు శుభవార్త.. త్వరలోనే తిరుమలకు మెట్రో.!
Follow us on

Metro To Tirumala: రాజధాని వాసులకు మెట్రో సంస్థ శుభవార్త అందించింది. రెండో దశలో ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రోను తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నామని స్పష్టం చేసింది. ప్రస్తుతం పాతబస్తీలో 5 కిలోమీటర్ల కట్టడానికి చర్యలు తీసుకోనున్నట్లు సంస్థ అధికారులు వెల్లడించారు. ఇక ఆ తర్వాత రెండో దశలో రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్ట్ వరకు 31 కిలోమీటర్లు.. అలాగే లక్డీ కపూల్ నుంచి ఎయిర్‌పోర్ట్‌కు నూతన రూట్లు ప్లాన్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు.

Also Read: Here Are The Details Of YSR Jagananna Vasathi Deevena

ఇదిలా ఉంటే నాగోల్ నుంచి ఎల్బీ నగర్ వరకు కూడా మెట్రో ఆలోచన ఉందని.. రెండో దశ కోసం ఢిల్లీ మెట్రో వారు డిపీఆర్ సిద్ధం చేశారని చెప్పారు. అటు ఎల్‌&టీకి రోజుకు కోటి రూపాయల వరకు ఆదాయం వస్తోందని తెలపగా..  మెట్రో మాల్స్ నుంచి నెలకు సుమారుగా రూ. 10 కోట్లుఆదాయం చేకూరుతోందని స్పష్టం చేశారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రోకు 269 ఎకరాలు భూమి ఇచ్చిందన్నారు. ఇక నిర్మాణం ఎక్కువ సమయం పట్టడంతో.. వ్యయం కూడా పెరిగిందని తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 16 కోట్ల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

Also Read: who is the lady accompanying donald trump melania and narendra modi

కాగా, తిరుపతి నుంచి తిరుమల కొండపైకి మెట్రో విషయంపై మూడు రోజులు సర్వే చేశామన్నారు. తిరుమల మొత్తం రిజర్వ్ ఫారెస్ట్ కింద డిక్లేర్ కావడంతో కాలుష్యం తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకుని.. తిరుమల ప్రాజెక్టు‌పై నిర్ణయం తీసుకుంటే.. ప్రయత్నాలు మొదలుపెడతామని వెల్లడించారు.

Also Read: వింత వైరస్ ఎఫెక్ట్: 30 వేల కోళ్ల మృతిపై.. అధికారుల క్లారిటీ..