Corona: కరోనా కేసుల్లో ప్రథమ స్థానంలో ఆ రాష్ట్రంలో… 20 లక్షలకు చేరువగా పాజిటివ్ కేసులు…

మహారాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,38,854కు, మరణాల సంఖ్య 49,631కు పెరిగింది. మరోవైపు 24 గంటల్లో...

Corona: కరోనా కేసుల్లో ప్రథమ స్థానంలో ఆ రాష్ట్రంలో... 20 లక్షలకు చేరువగా పాజిటివ్ కేసులు...

Updated on: Jan 03, 2021 | 5:43 AM

మహారాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,38,854కు, మరణాల సంఖ్య 49,631కు పెరిగింది. మరోవైపు 24 గంటల్లో 2,110 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 18,34,935కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 53,137 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది. కాగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలపరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది. అయితే మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు వేలల్లో పాజిటివ్‌ కేసులు, 50కిపైగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. జనవరి 1తేదీ, 2 తేదీ వరకు కొత్తగా 3,218 కరోనా కేసులు, 51 మరణాలు నమోదయ్యాయి.

 

Also Read: COVID-19 vaccine: తొలి దశలో వీరికే ఉచిత వ్యాక్సిన్.. ఆ తరువాతే మిగతా వారికి.. ప్రకటించిన కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్

Loading...
Unable to load recommendations.
Follow Us