‘డిజైన్ ఇన్ ఇండియా’ కాంటెస్ట్‌ను ప్రారంభించిన లావా..

లావా ఈరోజు తన రాబోయే స్మార్ట్‌ఫోన్ కోసం ‘డిజైన్ ఇన్ ఇండియా’ కాంటెస్ట్‌ను ప్రారంభించింది. లావా తన తదుపరి ఫోన్‌ను భారతదేశంలో డిజైన్ చేసేందుకు విద్యార్థులు, నిపుణులను

‘డిజైన్ ఇన్ ఇండియా’ కాంటెస్ట్‌ను ప్రారంభించిన లావా..

Updated on: Jul 03, 2020 | 4:34 AM

LAVA launches ‘Design in India’ contest: లావా ఈరోజు తన రాబోయే స్మార్ట్‌ఫోన్ కోసం ‘డిజైన్ ఇన్ ఇండియా’ కాంటెస్ట్‌ను ప్రారంభించింది. లావా తన తదుపరి ఫోన్‌ను భారతదేశంలో డిజైన్ చేసేందుకు విద్యార్థులు, నిపుణులను ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా బీ.టెక్/బీఈ/బి.డెస్/ఎం.డెస్ విద్యార్థులు, నిపుణులను ఆహ్వానిస్తోంది. ఈ పోటీ మూడు విడతల్లో ఉంటుంది. భావజాలం, నమూనా రూపకల్పన, జ్యూరీకి ప్రదర్శించడం వంటి దశలు ఉంటాయి. న్యాయమూర్తుల ప్యానెల్‌కు లావా చీప్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫీసర్ సంజీవ్ అగర్వాల్ నేతృత్వం వహిస్తారు.

లావాతో పాటు ఇతర భారతీయ మొబైల్ కంపెనీలు.. మైక్రోమాక్స్, కార్బన్ కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్‌లకు కృషి చేస్తున్నాయి. కాగా.. ఈ ‘డిజైన్ ఇన్ ఇండియా’ కాంటెస్ట్ లో పాల్గొన్న వారు లావా డిజైన్ బృందం నుంచి మార్గదర్శకత్వం పొందుతారు. పోటీలో పాల్గొన్నవారిలో టాప్-3 బృందాలను లావా ఎంపిక చేస్తుంది. వీరికి ప్రీ ప్లేస్‌మెంట్ ఇంటర్వ్యూ అవకాశం కూడా ఉంది. టాప్-3 టీమ్స్‌కు వరుసగా రూ. 50,000, రూ25,000, రూ.15,000 అందిస్తారు. జులై 9 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.

Also Read: అసోంలో వరద బీభత్సం.. 33కు పెరిగిన మృతుల సంఖ్య..

Loading...
Unable to load recommendations.
Follow Us