హోం క్వారంటైన్ లోకి కర్నాటక సీఎం యడ్యూరప్ప

|

Jul 10, 2020 | 5:49 PM

కరోనా కట్టడిలో ముందు వరుసలో ఉన్న రాష్ట్రాలు సైతం వైరస్ విస్తరిస్తోంది. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్ప హోం క్వారంటైన్ లో వెళ్లారు. ఇకపై కొద్ది రోజుల పాటు ఇంటి నుంచే పనిచేయనున్నట్లు 77 ఏళ్ల యడ్యూరప్ప తెలిపారు .

హోం క్వారంటైన్ లోకి కర్నాటక సీఎం యడ్యూరప్ప
Follow us on

కరోనా కట్టడిలో ముందు వరుసలో ఉన్న రాష్ట్రాలు సైతం వైరస్ విస్తరిస్తోంది. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్ప హోం క్వారంటైన్ లో వెళ్లారు. ఇకపై కొద్ది రోజుల పాటు ఇంటి నుంచే పనిచేయనున్నట్లు 77 ఏళ్ల యడ్యూరప్ప తెలిపారు . శుక్రవారం కోవిడ్ -19 పరిస్థితిని సమీక్షించడానికి బెంగళూరు మహానగర పాలిక సహా మొత్తం 198 మంది కార్పొరేటర్లతో సీఎం యడ్యూరప్ప సమావేశం నిర్వహించాల్సి ఉంది. అయితే, ఆయన వద్ద పనిచేసే సిబ్బందిలో కొందరికి కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయ్యింది. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని మూసివేసిన అధికారులు పూర్తిస్థాయిలో శానిటైజేషన్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ముందు జాగ్రత్త చర్యగా తాను ఇంటి నుంచి పని చేయనున్నట్లు యడ్యూరప్ప చెప్పారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ముందు జాగ్రత్త కోసం ఇంటి నుంచి పనిచేస్తున్నానని ట్వీట్టర్ వేదికగా వెల్లడించారు. ప్రజలెవరు భయమపడవద్దని విజ్ఞప్తి చేశారు. ఆయన ఆన్‌లైన్‌ ద్వారా సలహాలు, సూచనలు అందిస్తానని స్పష్టం చేశారు. ప్రజలందరూ కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించి కరోనా వ్యాప్తిని ఆరికట్టాలని యడ్యూరప్ప పిలుపునిచ్చారు.