రాణీ రనౌత్‌ రక్షణ కోసం తల్లి ‘మహా మంత్ర జపం’

|

Aug 18, 2020 | 10:27 AM

బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా ముద్ర వేసుకుంది. సుశాంత్ సింగ్ మ‌ర‌ణించిన త‌ర్వాత కొంద‌రు బాలీవుడ్ సెల‌బ్రిటీల‌ని టార్గెట్ చేస్తూ విరుచుకుప‌డుతున్న కంగ‌నా తాజాగా అమీర్ ఖాన్‌పై కూడా విమ‌ర్శ‌లు...

రాణీ రనౌత్‌ రక్షణ కోసం తల్లి మహా మంత్ర జపం
Follow us on

సినిమాలో కత్తి పట్టి యుద్ధం చేసిన కంగనా రనౌత్.. నిజ జీవితంలోనూ వివిధ అంశాలపై పోరాటం చేస్తోంది. దీంతో బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా ముద్ర వేసుకుంది. సుశాంత్ సింగ్ మ‌ర‌ణించిన త‌ర్వాత కొంద‌రు బాలీవుడ్ సెల‌బ్రిటీల‌ని టార్గెట్ చేస్తూ విరుచుకుప‌డుతున్న కంగ‌నా తాజాగా అమీర్ ఖాన్‌పై కూడా విమ‌ర్శ‌లు గుప్పించింది. ముక్కుసూటిగా మాట్లాడేత‌త్వం ఉన్న కంగ‌నా తాను ఎవ‌రికి భ‌య‌ప‌డ‌న‌ని చెప్పుకొస్తుంది.

ఇదిలావుంటే..తన కూతురుకు రక్షణగా ఉండాలంటూ దేవతలను ప్రార్థిస్తోంది కంగనా రనౌత్ తల్లి. త‌న కుమార్తె ర‌క్ష‌ణ విష‌యంలో భ‌య‌ప‌డుతున్న కంగ‌నా త‌ల్లి కూతురి కోసం మహామృతుంజయ హోమాన్ని నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియోను కంగ‌నా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. “మా అమ్మ నా ర‌క్ష‌ణ‌ గురించి ఆందోళన చెందుతున్నారు. అందుకే లక్షా పదిహేను వేల సార్లు మహామృత్యుంజ‌య మంత్రం జపించారు” అని తన ఇన్ట్సాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అనంతరం హోమం నిర్వహించినట్లుగా తెలుస్తోంది. కంగనా రనౌత్ చేస్తున్న యుద్ధానికి సోషల్ మీడియా వేదికగా ఓ పెద్ద ఆర్మీ కూడా ఉంది.