రెండోసారి కరోనా సోకి కడప డాక్టర్ మృతి

|

Nov 08, 2020 | 3:10 PM

 కరోనా వైరస్‌ను అస్సలు లైట్ తీసుకోవద్దు. దాని విజృంభణ ఇంకా ఆగిపోలేదు. కఠిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. మాస్క్, భౌతికదూరం తప్పనిసరి. ఎప్పటికప్పుడు చేతులను శానిటైజర్‌తో శుభ్రపరుచుకోండి.

రెండోసారి కరోనా సోకి కడప డాక్టర్ మృతి
Follow us on

కరోనా వైరస్‌ను అస్సలు లైట్ తీసుకోవద్దు. దాని విజృంభణ ఇంకా ఆగిపోలేదు. కఠిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. మాస్క్, భౌతికదూరం తప్పనిసరి. ఎప్పటికప్పుడు చేతులను శానిటైజర్‌తో శుభ్రపరుచుకోండి. తుమ్మేటప్పుడు, దగ్గేటప్పుడు రుమాలు లేదా టిష్యూను అడ్డుపెట్టుకోండి. ఇంతలా ఎందుకు చెబుతున్నామంటే..కరోనా రెండోసారి కూడా సోకుతుంది. తాజాగా  కరోనా రెండో సారి సోకి 28ఏళ్ల గవర్నమెంట్ డాక్టర్ మృతి చెందారు. కడప జిల్లా బద్వేలు ప్రభుత్వ ఆస్పత్రి పిల్లల డాక్టర్ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వైరస్ సోకడంతో నెలరోజుల క్రితం గుంటూరు ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన వ్యాధి నుంచి కోలుకొని తిరిగి విధుల్లో చేరారు. 14 రోజుల క్రితం అతడికి మరోసారి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కడప రిమ్స్‌, తిరుపతి స్విమ్స్‌లోనూ చికిత్స తీసుకున్నారు. అయితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో  రెండు రోజుల క్రితం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఇవాళ చికిత్స పొందుతూ డాక్టర్ ప్రాణాలు విడిచారు.

Also Read :  దిండు కింద ఫోన్‌ పేలి వ్యక్తికి తీవ్ర గాయాలు