జనసేనాని పవన్ కళ్యాణ్ తన పదవిని వదులుకొని సినిమాల్లో నటిస్తారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని ఆ పార్టీ స్పష్టం చేసింది. పవన్ కళ్యాణ్ పేరిట కొందరు తప్పుడు లేఖను సృష్టించినట్లు పార్టీ దృష్టికి వచ్చినట్లు జనసేన రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. కాగా ఆ లేఖలో పేర్కొన్నవన్నీ కట్టు కథలేనని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, ఆయన పేరిట జరుగుతున్న సేవా కార్యక్రమాలు చూసి ఓర్వలేక కొంతమంది ఇలాంటి చర్యకు పాల్పడ్డారు. ఈ విషయమై కేసులు పెట్టాలని నిర్ణయించినట్లు చెప్పుకొచ్చారు. నిరంతరం ప్రజలకు చేరువగా ఉండి వారి పక్షాన పోరాడడమే పవన్ లక్ష్యమని, అందుకు ఆయన ప్రజా క్షేత్రంలోనే ఉంటున్నారని పవన్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ పేర్కొన్నారు.
శ్రీ పవన్ కల్యాణ్ గారు పేరిట వచ్చిన లేఖ పచ్చి మోసం pic.twitter.com/9RceYLOjOI
— JanaSena Party (@JanaSenaParty) September 2, 2019