రోదసిలో మరింత నిఘా.. ‘ పీఎస్ఎల్వీ-సీ-48 ‘ లాంచ్ కి ఇస్రో రెడీ..

|

Dec 05, 2019 | 2:15 PM

రాడార్ తో భూఉపరితల అబ్జర్వేషన్ (భూగ్రహ పరిశీలన) కోసం ఉద్దేశించిన ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఇస్రో రెడీ అవుతోంది. లాంచ్ వెహికికల్ అయిన పీఎస్ఎల్వీ-సీ 48 రాకెట్.. ఈ శాటిలైట్ తో బాటు 9 కమర్షియల్ శాటిలైట్లను కూడా మోసుకువెళ్లనుంది. ఈ నెల 11 న ఈ రాకెట్ ను ప్రయోగించనున్నారు. ఈ తొమ్మిది వాణిజ్య ఉపగ్రహాల్లో.. ఆరు అమెరికాకు చెందినవి కాగా.. మూడింటిలో ఒకటి ఇజ్రాయెల్ కు, మరొకటి ఇటలీకి, ఇంకొకటి జపాన్ కు చెందినవి. శ్రీహరికోటలోని […]

రోదసిలో  మరింత నిఘా..  పీఎస్ఎల్వీ-సీ-48   లాంచ్ కి ఇస్రో రెడీ..
Follow us on

రాడార్ తో భూఉపరితల అబ్జర్వేషన్ (భూగ్రహ పరిశీలన) కోసం ఉద్దేశించిన ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఇస్రో రెడీ అవుతోంది. లాంచ్ వెహికికల్ అయిన పీఎస్ఎల్వీ-సీ 48 రాకెట్.. ఈ శాటిలైట్ తో బాటు 9 కమర్షియల్ శాటిలైట్లను కూడా మోసుకువెళ్లనుంది. ఈ నెల 11 న ఈ రాకెట్ ను ప్రయోగించనున్నారు. ఈ తొమ్మిది వాణిజ్య ఉపగ్రహాల్లో.. ఆరు అమెరికాకు చెందినవి కాగా.. మూడింటిలో ఒకటి ఇజ్రాయెల్ కు, మరొకటి ఇటలీకి, ఇంకొకటి జపాన్ కు చెందినవి. శ్రీహరికోటలోని షార్ కేంద్రంలో గల తొలి లాంచ్ పాడ్ నుంచి పీ ఎస్ఎల్వీసీ-48.’ రిశాట్-2 బీఆర్ఐ ‘ ని లాంచ్ చేయనుందని ఇస్రో వర్గాలు తెలిపాయి. వాతావరణం అనుకూలించిన పక్షంలో.. ఈ నెల 11 వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 25 నిముషాలకు ఈ రాకెట్ నింగిలోకి ఎగయనుంది. సుమారు 628 కేజీల బరువైన ఈ రాకెట్.. క్యూ ఎల్ కన్ఫిగరేషన్ లోని పీఎస్ఎల్వీ వరుస రాకెట్లలో రెండవది.

న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ తో కుదిరిన వాణిజ్య ఒప్పందం ప్రకారం..అంతర్జాతీయ కస్టమర్ శాటిలైట్స్ ని లాంచ్ చేస్తున్నట్టు ఈ వర్గాలు స్పష్టం చేశాయి. నిజానికి తాము 4 నుంచి 5 రిశాట్ ఉపగ్రహాలను ప్రయోగించాలని ల్లక్ష్యంగా పెట్టుకున్నామని ఇస్రో పేర్కొంది. వీటిలో ఒకదానిని ఈ ఏడాది మే 22 న ప్రయోగించారు. రోజువారీ ప్రాతిపదికపై ప్రత్యేక ప్రాంతం మీద నిఘా ఉంచేందుకు సెక్యూరిటీ వ్యవస్థలకు అంతరిక్షంలో కనీసం 4 రిశాట్ ఉపగ్రహాలు అవసరమవుతాయట.
ఇటీవలే (నవంబర్ 27 న )అత్యంత ఆధునిక ‘ కార్టోశాట్-3 ‘ ని ఇస్రో ప్రయోగించింది. ఈ ఉపగ్రహం అప్పుడే పని చేయడం ప్రారంభించింది.