రోహిత్ సేన ఆల్‌రౌండ్‌ షో.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానం

|

Oct 01, 2020 | 11:31 PM

ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో 48 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై ఘనవిజయం సాధించింది.

రోహిత్ సేన ఆల్‌రౌండ్‌ షో.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానం
Follow us on

IPL 2020: ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో 48 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై ఘనవిజయం సాధించింది. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ(70; 45 బంతుల్లో 8×4, 3×6) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో పాటు, చివర్లో పొలార్డ్(47 నాటౌట్‌; 20 బంతుల్లో 3×4, 4×6), హార్దిక్ (30 నాటౌట్‌; 11 బంతుల్లో 3×4, 2×6) మెరుపులు తోడవ్వడంతో మొదట ముంబై 4 వికెట్లకు 191 పరుగులు చేసింది. ఛేదనలో పంజాబ్ విఫలమైంది. పాటిన్సన్(2/28), బుమ్రా (2/18), చాహర్(2/26) ధాటికి 8 వికెట్లకు 143 పరుగులే చేయగలిగింది. రాహుల్(17), మయాంక్ అగర్వాల్(25) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరగా.. మాక్స్‌వెల్‌ మరోసారి విఫలమయ్యాడు. నికోలస్ పూరన్‌ (44; 27 బంతుల్లో 3×4, 2×6) టాప్‌ స్కోరర్‌.