దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య..!

|

May 30, 2020 | 9:32 PM

దేశవ్యాప్తంగా కొవిడ్ -19 విస్తరిస్తున్న కరోనావైరస్ సోకి తగ్గుముఖం పట్టిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతుందని కేంద్రం ఆరోగ్య తెలిపింది. మొత్తం 1,74,355 కేసులతో మనదేశం టర్కీని అధిగమించిందని వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో 11,264 మంది కరోనా తగ్గడంతో రికవరీ రేటు 4.51 శాతం పెరిగి 47.40 శాతానికి చేరుకుంది. యాక్టివ్ కేసు సంఖ్య 89,987 నుండి 86,422 కు తగ్గినట్లు కేంద్రం ప్రకటించింది. ఇక ఇప్పటివరకు 62,228 కరోనా కేసులు నమోదు కాగా, 2,098 […]

దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య..!
Follow us on

దేశవ్యాప్తంగా కొవిడ్ -19 విస్తరిస్తున్న కరోనావైరస్ సోకి తగ్గుముఖం పట్టిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతుందని కేంద్రం ఆరోగ్య తెలిపింది. మొత్తం 1,74,355 కేసులతో మనదేశం టర్కీని అధిగమించిందని వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో 11,264 మంది కరోనా తగ్గడంతో రికవరీ రేటు 4.51 శాతం పెరిగి 47.40 శాతానికి చేరుకుంది. యాక్టివ్ కేసు సంఖ్య 89,987 నుండి 86,422 కు తగ్గినట్లు కేంద్రం ప్రకటించింది. ఇక ఇప్పటివరకు 62,228 కరోనా కేసులు నమోదు కాగా, 2,098 మరణాలతో మహారాష్ట్ర దేశంలోనే అత్యధిక కేసులు నమోదైన ప్రాంతంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గుర్తించారు.
గత వారం దేశవ్యాప్తంగా 28,34,798 కరోనా వైరస్ నమూనాలను పరీక్షించగా గత 24 గంటల్లో 1,15,364 నమూనాలను పరీక్షించామని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది. ప్రస్తుతం మనదేశంలో లాక్ డౌన్ నాలుగో దశలో ఉండగా.. సగటున 7,000 మందికి పైగా కరోనా టెస్ట్ లు చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. మరోవైపు జూన్-జూలై నాటికి దేశంలో ఎక్కువ కేసులు నమోదవుతాయని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.