ఇండియాలో క‌రోనా క‌ల్లోలం : ఒక్క రోజులో 1045 మరణాలు

|

Sep 02, 2020 | 11:05 AM

దేశంలో కరోనా వీర‌విహారం చేస్తోంది. మంగళవారం ఒక్కరోజే 78,357 కొత్త కేసులు న‌మోద‌య్యాయి.

ఇండియాలో క‌రోనా క‌ల్లోలం : ఒక్క రోజులో 1045 మరణాలు
Follow us on

దేశంలో కరోనా వీర‌‌విహారం చేస్తోంది. మంగళవారం ఒక్కరోజే 78,357 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 37,69,524కు చేరింది. వీరిలో ఇప్పటికే 29లక్షల మంది కోలుకోగా మరో 8లక్షల యాక్టీవ్ కేసులు ఉన్నాయి. వైరస్​ కార‌ణంగా కొత్త‌గా మరో 1,045 మంది ప్రాణాలు విడువ‌గా..మొత్తం మరణాల సంఖ్య 66,333కు చేరింది. దేశవ్యాప్తంగా మంగళవారం ఒక్కరోజే 10,12,367 కరోనా టెస్టులు చేసిన‌ట్లు ఐసీఎంఆర్. ఫలితంగా మొత్తం టెస్ట్​ల సంఖ్య 4 కోట్ల 43 లక్షలకు చేరింది.

క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతున్న‌ప్ప‌టికీ.. రిక‌వ‌రీ అయ్యేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. దేశవ్యాప్త రికవరీ రేటు 76.98 శాతంగా ఉండ‌గా, డెత్ రేటు 1.76 శాతానికి పడిపోయింది.

Also Read :

వైసీపీలో విషాదం : కీల‌క నేత ఆక‌స్మిక మ‌ర‌ణం

మద్యం వ్యవహారం : ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు కానిస్టేబుళ్లు అరెస్ట్

కళింగపట్నంలో ఆక‌ట్టుకుంటున్న‌ పవన్ సైకత శిల్పం