వైసీపీలో విషాదం : కీల‌క నేత ఆక‌స్మిక మ‌ర‌ణం

అధికార వైసీపీకి చెందిన కీల‌క నేత ఆక‌స్మాత్తుగా క‌న్నుమూశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన వైసీపీ నేత‌, ప్రముఖ వస్త్ర వ్యాపారి, బొమ్మన బ్రదర్స్‌ అధినేత రాజ్‌కుమార్ తుదిశ్వాస విడిచారు.

వైసీపీలో విషాదం : కీల‌క నేత ఆక‌స్మిక మ‌ర‌ణం
Follow us

|

Updated on: Sep 02, 2020 | 9:53 AM

అధికార వైసీపీకి చెందిన కీల‌క నేత ఆక‌స్మాత్తుగా క‌న్నుమూశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన వైసీపీ నేత‌, ప్రముఖ వస్త్ర వ్యాపారి, బొమ్మన బ్రదర్స్‌ అధినేత రాజ్‌కుమార్ తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజులుగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతోన్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ప‌రిస్థితి విష‌మించి మంగళవారం మధ్యాహ్నం ప్రాణాలు విడిచారు. వైఎస్సార్‌సీపీలో కీలక నాయకుడిగా వ్య‌వ‌హ‌రిస్తోన్న‌ రాజ్‌కుమార్‌ మరణవార్తతో పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతికి గుర‌య్యారు.

రాజ్‌కుమార్ భౌతిక కాయాన్ని రాజమండ్రి తీసుకొచ్చారు. బుధవారం కోరుకొండ మండలం దోసకాయలపల్లిలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో అంతిమ సంస్కారాలు నిర్వ‌హించ‌నున్నారు. రాజ్‌కుమార్‌ మృతికి సంతాప సూచికంగా నగరంలోని అన్ని షాపులు బుధవారం స్వచ్ఛందంగా మూసివేయాల‌ని ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నిర్ణయించింది. ప్రస్తుతం రాజ్‌కుమార్.. ది జాంపేట కోఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు ఛైర్మన్‌గా ఉన్నారు. 2014లో వైఎస్సార్‌సీపీ నుంచి రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి పోటీచేసి పరాజయం పాల‌య్యారు. ఆ తర్వాత పార్టీలో కీల‌క భూమిలో పోషిస్తున్నారు.

Also Read :

కళింగపట్నంలో ఆక‌ట్టుకుంటున్న‌ పవన్ సైకత శిల్పం

మద్యం వ్యవహారం : ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు కానిస్టేబుళ్లు అరెస్ట్

అభిమానుల మ‌ర‌ణంపై స్పందించిన ప‌వ‌న్ కళ్యాణ్