ప్రజలకు వ్యాక్సిన్లు ఇ చ్చిన దేశాల్లో ఇండియాకు మూడో స్థానం, కేంద్రం వెల్లడి. త్వరలో మళ్ళీ రెండో డోసు

| Edited By: Pardhasaradhi Peri

Feb 07, 2021 | 5:56 PM

ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్లు ఇచ్చిన దేశాల్లో ఇండియా మూడో స్థానంలో నిలిచిందని కేంద్రం వెల్లడించింది. అమెరికా, బ్రిటన్ తరువాత మన దేశం అత్యధిక..

ప్రజలకు వ్యాక్సిన్లు ఇ చ్చిన దేశాల్లో ఇండియాకు మూడో స్థానం, కేంద్రం వెల్లడి. త్వరలో మళ్ళీ రెండో డోసు
Follow us on

Covid Vaccine: ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్లు ఇచ్చిన దేశాల్లో ఇండియా మూడో స్థానంలో నిలిచిందని కేంద్రం వెల్లడించింది. అమెరికా, బ్రిటన్ తరువాత మన దేశం అత్యధిక టీకామందులు ఇచ్చిన దేశమైందని ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ నెల 7 వరకు 57.75 లక్షలమంది కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకున్నారని, 1.15 లక్ష్ఝల సెషన్స్ నిర్వహించడం జరిగిందని ఈ శాఖ అధికారులు పేర్కొన్నారు. 53 వేలమందికి పైగా  హెల్ట్జ్హ్ కేర్ వర్కర్లు, 4 లక్షలకు పైగా ఫ్రంట్ లైన్ వర్కర్లు వ్యాక్సిన్లు తీసుకున్నారని, దేశంలో మొత్తం 12 రాష్ట్రాల్లో ఒక్కో రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల మందికి పైగా టీకామందులను ఇచ్చిందన్నారు. ఒక్క యూపీలోనే సుమారు 7 లక్షలమంది వీటిని తీసుకున్నారని ఆ రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ఇక గత 24 గంటల్లో 80 మంది కరోనా రోగులు మృతి చెందారు. ఈ 9 నెలల్లో ఇది అత్యధిక స్వల్పమని అధికారులు తెలిపారు. దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 1.48 లక్షలకు చేరినట్టు వారు చెప్పారు. ఇక రెండో విడత డోసు ఈ నెల 13  నుంచి ప్రారంభం కానుందని వారు పేర్కొన్నారు. మొదటి విడత డోసు తీసుకున్నవారు ఈ నెల 13 నుంచి రెండో డోసు తీసుకోవలసి ఉంటుందన్నారు.  జనవరి 16 నుంచి ఇండియాలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది.