గుడ్ న్యూస్.. కరోనా ఇంజక్షన్ క్లినికల్ ట్రయల్స్​కు ఐసీఎంఆర్ ప‌ర్మిష‌న్..!

| Edited By: Pardhasaradhi Peri

May 31, 2020 | 9:18 AM

కొవిడ్- 19తో పోరాటం చేసేందుకు అవసరమైన యాంటీబాడీస్​ను…. ‘హ్యూమన్ కొవిడ్- 19 ఇమ్యూనో గ్లోబిన్ ఇంజక్షన్’ పేరుతో త‌యారు చేశామ‌ని హైదరాబాద్​కు చెందిన ఎంఆర్​పీఏ కార్పొరేషన్ వెల్ల‌డించింది. దీనికి ఇప్పటికే ఇండియన్ కౌన్సిపల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ గుర్తింపు వ‌చ్చింద‌ని…. క్లినికల్ ట్రయల్స్ జ‌రిపేందుకు సైతం తాజాగా ప‌ర్మిష‌న్ ఇచ్చిందని ఆ సంస్థ ఛైర్మన్, విశాఖకు చెందిన డాక్టర్ శ్రీహరి తెలిపారు. ఈ ఇంజక్షన్​ను కోవిడ్-19 నిర్దార‌ణ కాక‌ముందు లేదా నిర్దార‌ణ అయిన‌ తరువాత కూడా ఇవ్వవచ్చని […]

గుడ్ న్యూస్.. కరోనా ఇంజక్షన్ క్లినికల్ ట్రయల్స్​కు ఐసీఎంఆర్ ప‌ర్మిష‌న్..!
Follow us on

కొవిడ్- 19తో పోరాటం చేసేందుకు అవసరమైన యాంటీబాడీస్​ను…. ‘హ్యూమన్ కొవిడ్- 19 ఇమ్యూనో గ్లోబిన్ ఇంజక్షన్’ పేరుతో త‌యారు చేశామ‌ని హైదరాబాద్​కు చెందిన ఎంఆర్​పీఏ కార్పొరేషన్ వెల్ల‌డించింది. దీనికి ఇప్పటికే ఇండియన్ కౌన్సిపల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ గుర్తింపు వ‌చ్చింద‌ని…. క్లినికల్ ట్రయల్స్ జ‌రిపేందుకు సైతం తాజాగా ప‌ర్మిష‌న్ ఇచ్చిందని ఆ సంస్థ ఛైర్మన్, విశాఖకు చెందిన డాక్టర్ శ్రీహరి తెలిపారు. ఈ ఇంజక్షన్​ను కోవిడ్-19 నిర్దార‌ణ కాక‌ముందు లేదా నిర్దార‌ణ అయిన‌ తరువాత కూడా ఇవ్వవచ్చని తెలిపారు. దీని ద్వారా ఇమ్యూనో గ్లోబిన్స్​ను బాడీలోకి పంపితే అవి కరోనా వైరస్​తో పోరాడతాయని వివ‌రించారు. కరోనాకు స‌మ‌ర్థ‌వంత‌మైన‌ వ్యాక్సిన్ వచ్చేలోపు కొంతమందిని అయినా సేవ్ చెయ్యాల‌నే లక్ష్యంతో ఇంజక్షన్​ను రూపొందించామని ఆయన అన్నారు.

సుమారు 50 మంది పైన క్లినికల్ ట్రయల్స్ చేసి రిపోర్ట్ అందించాలని ఐసీఎంఆర్ కోరిందని డాక్టర్ శ్రీహరి పేర్కొన్నారు. కోవిడ్-19 సోకిన వారు ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకు వస్తే వారిపై క్లినికల్ ట్రయల్స్ జ‌రుపుతామ‌న్నారు. పూర్తి స్థాయిలో స‌క్సెస్ అయితే దీన్ని వెంటనే ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు య‌త్నిస్తామ‌ని శ్రీహరి తెలిపారు. మెరుగైన ఫ‌లితాలు రాకపోతే…. కొవిడ్- 19 కోసమే స్పెష‌ల్ గా యాంటీబాడీస్​ను తయారు చేసే పనిలో కూడా తమ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఎంఆర్​పీఏ కార్పొరేషన్ ఉందని ఆయన చెప్పారు.