కర్ణాటకలో అనుమానిత ఉగ్రవాది కలకలం

కర్ణాటకలో అనుమానిత ఉగ్రవాదిని అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. రాష్ట్ర రాజధాని బెంగళూరుకు 600కిలోమీటర్ల దూరంలో ఉన్న దొడ్డబల్లాపుర పట్టణంలో ఒక అనుమానితుడిని ఎన్‌ఐఏ అధికారులు గురువారం అదుపులోకి తీసుకొన్నారు. పట్టుబడిన వ్యక్తిని బంగ్లాదేశ్‌ జాతీయుడిగా గుర్తించినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర హోంమంత్రి ఎంబీ పాటిల్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయమై తాను సీఐడీ అధికారులతో సమావేశమైనట్లు తెలిపారు. భద్రతా ప్రమాణాల దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా హైఅలర్ట్‌ ప్రకటించినట్లు వెల్లడించారు.

కర్ణాటకలో అనుమానిత ఉగ్రవాది కలకలం
Follow us

|

Updated on: Jun 28, 2019 | 8:11 PM

కర్ణాటకలో అనుమానిత ఉగ్రవాదిని అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. రాష్ట్ర రాజధాని బెంగళూరుకు 600కిలోమీటర్ల దూరంలో ఉన్న దొడ్డబల్లాపుర పట్టణంలో ఒక అనుమానితుడిని ఎన్‌ఐఏ అధికారులు గురువారం అదుపులోకి తీసుకొన్నారు. పట్టుబడిన వ్యక్తిని బంగ్లాదేశ్‌ జాతీయుడిగా గుర్తించినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర హోంమంత్రి ఎంబీ పాటిల్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయమై తాను సీఐడీ అధికారులతో సమావేశమైనట్లు తెలిపారు. భద్రతా ప్రమాణాల దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా హైఅలర్ట్‌ ప్రకటించినట్లు వెల్లడించారు.

Latest Articles