నిర్మాతకు రూ.2 కోట్లు తిరిగిచ్చిన గోపీచంద్ !
టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో సీటీమార్ సినిమాలో నటిస్తున్నాడు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో సీటీమార్ సినిమాలో నటిస్తున్నాడు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ ప్రాజెక్టు సెట్స్ పై ఉండగానే గోపీచంద్ మరో యాక్షన్ ఎంటర్టైనర్కు పచ్చజెండా ఊపినట్లు వార్తలు వచ్చాయి. భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ సిసిమాను బడా ప్రొడ్యూసర్ బీవీఎస్ఎస్ ప్రసాద్ నిర్మించేందుకు సిద్దమయ్యారు. తమిళ డైరెక్టర్ బిను సుబ్రమణియన్ తెరకెక్కించనున్న ఈ మూవీ పనులు కూడా కొన్ని నెలల క్రితం ప్రారంభమయ్యాయి.
అయితే తాజాగా గోపీచంద్ ఈ ప్రాజెక్టుకు నో చెప్పినట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు తనకిచ్చిన రూ.2 కోట్ల అడ్వాన్స్ ను నిర్మాతకు తిరిగిచ్చేశాడని టాక్ నడుస్తోంది. అయితే దీనిపై ఇరు వర్గాలపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. లెట్స్ వెయిట్ అండ్ సీ.
Also Read :
సంచలన నిర్ణయం దిశగా జగన్ సర్కార్ : రేషన్ బియ్యం వద్దంటే డబ్బు!
పబ్జీ పెట్టిన చిచ్చు : తుపాకులు, లాఠీలతో రెండు కుటుంబాల ఘర్షణ