వాళ్ళు మా రాష్ట్ర రైతులు కారు, ఈ ఆందోళనకు పంజాబ్ ముఖ్యమంత్రే కారణం, హర్యానా సీఎం ఖట్టర్

తమ పొరుగు రాష్ట్రమైన పంజాబ్ పై హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ విరుచుకపడ్డారు. రైతులు ఆందోళన బాట పట్టడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం  అమరేందర్ సింగే కారణమని..

వాళ్ళు మా రాష్ట్ర రైతులు కారు, ఈ ఆందోళనకు పంజాబ్ ముఖ్యమంత్రే కారణం, హర్యానా సీఎం ఖట్టర్

Edited By:

Updated on: Nov 28, 2020 | 4:31 PM

తమ పొరుగు రాష్ట్రమైన పంజాబ్ పై హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ విరుచుకపడ్డారు. రైతులు ఆందోళన బాట పట్టడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం  అమరేందర్ సింగే కారణమని ఆయన ఆరోపించారు. అమరేందర్ కార్యాలయ ఆఫీసు బేరర్లే రైతుల నిరసనకు నేతృత్వం వహిస్తున్నారని ఆయన అన్నారు. ఈ ఆందోళన చేస్తున్నవారు తమ రాష్ట్ర రైతులు కారని, వారంతా పొరుగు రాష్ట్రంవారని అన్నారు. ఈ ప్రొటెస్ట్ కి మా అన్నదాతలు దూరంగా ఉన్నారు. నన్నడిగితే పంజాబ్ ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేసే ఆఫీసు బేరర్లే ఇందుకు కారణం అని ఖట్టర్ పేర్కొన్నారు. రైతుల ఆందోళనపై తాను పంజాబ్ ముఖ్యమంత్రితో మాట్లాడడానికి ప్రయత్నించినా ఆయన స్పందించలేదని ఖట్టర్ విమర్శించారు. ఇక తమ రాష్ట్ర పోలీసులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వారు ఎంతో నిగ్రహంతో వ్యవహరిస్తున్నారని, రైతులు రెచ్ఛగొట్టినా సంయమనంతో ఉన్నారని ఆయన అన్నారు.

ఢిల్లీ వెళ్తున్న అన్నదాతలను అడ్డుకోవద్దని, వారిని హర్యానా గుండా వెళ్లనివ్వాలని అమరేందర్ సింగ్ హర్యానా ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఇటీవల ట్వీట్ చేశారు. అయితే ఖట్టర్… మూడు రోజులుగా మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి యత్నిస్తున్నానని, కానీ మీ నుంచి రెస్పాన్స్ లేదని. మీరు కేవలం ట్వీట్లు చేస్తూ చర్చల నుంచి దూరంగా పారిపోతున్నారని ఎదురు దాడికి దిగారు. ఇలా ఉండగా రైతు లోకం ఢిల్లీలో ఇంత పెద్దఎత్తున ప్రదర్శనలకు దిగుతున్నా, వారిపై పోలీసులు లాఠీ ఛార్జి చేస్తూ, బాష్పవాయువు ప్రయోగిస్తున్నా ఒక్క రాజకీయ పార్టీకూడా స్పందించని విషయం గమనార్హం.

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us