చీరాల వైసీపీలో గ్రూపు వార్
చీరాల వైసీపీలో గ్రూపు వార్ నడుస్తోంది. నిన్ననే మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు కరణం వెంకటేష్. ఇవాళ దానికి రియాక్ట్ అయ్యారు ఆమంచి. కుప్పిగంతులు వేస్తే చూస్తూ ఊరుకోం అంటూ... కరణం వెంకటేష్ చేసిన వ్యాఖ్యలపై పార్టీకి ఆమంచి ఫిర్యాదు చేశారు.
చీరాల వైసీపీలో గ్రూపు వార్ నడుస్తోంది. నిన్ననే మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు కరణం వెంకటేష్. ఇవాళ దానికి రియాక్ట్ అయ్యారు ఆమంచి. కుప్పిగంతులు వేస్తే చూస్తూ ఊరుకోం అంటూ… కరణం వెంకటేష్ చేసిన వ్యాఖ్యలపై పార్టీకి ఆమంచి ఫిర్యాదు చేశారు. పోతుల సునీతపై కూడా పార్టీ జిల్లా ఇంచార్జ్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. తనపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని లేఖ రాశారు. బహిరంగంగా ప్రభుత్వంపై, పార్టీపై, పార్టీ నేతలపై విమర్శలు చేశారని ఫిర్యాదు చేశారు ఆమంచి.
వైఎస్ వర్థంతి సందర్భంగానే చీరాల వైసీపీలో గ్రూపు వార్ బయటపడింది. ఆమంచి కృష్ణమోహన్, కరణం వెంకటేష్లు విడివిడిగా వైఎస్కు నివాళులర్పించారు. ఆ సందర్భంగానే ఆమంచి కృష్ణమోహన్పై పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు కరణం వెంకటేష్. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపైనే పార్టీకి ఫిర్యాదు చేశారు ఆమంచి.