కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాల అమలుకు నమోదు చేసుకున్న అన్ని ప్రైవేటు హాస్పిటల్స్ తప్పనిసరిగా లబ్దిదారులకు ట్రీట్మెంట్ అందించాలని కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పింది. రూల్స్ అతిక్రమించిన ఆస్పత్రులపై కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది. అలానే కోవిడ్-19 అనువైనవిగా గుర్తించిన ప్రైవేటు ఆస్పత్రుల్లో.. వైరస్ సోకినవారితో పాటు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికీ చికిత్స అందించాలని తెలిపింది.
అలాగే అన్ని రకాల వ్యాధులకు నిబంధనల మేరకే ఫీజులు వసూలు చేయాలి. ఈ విషయాన్ని ఎవరైనా పెడచెవిన పెడితే చర్యలు తప్పవని వెల్లడించింది. ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు… కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాల అమలుకు నమోదు చేసుకున్నప్పటికీ..అర్హులైనవారిక సేవలు అందించకుండా తీవ్ర ఇబ్బందులు పెడుతున్నట్లు మంత్రిత్వశాఖ దృష్టికి రావడంతో రివ్యూ మీటింగ్ నిర్వహించింది.