Dattatreya Accident: చౌటుప్పల్ వద్ద రోడ్డు ప్రమాదం.. గవర్నర్‌ బండారు దత్తాత్రేయకు తృటిలో తప్పిన పెను ప్రమాదం..

|

Dec 14, 2020 | 12:20 PM

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుండి నల్లగొండకు వెళ్తుండగా చౌటుప్పల్ మండలం ఖైతాపురం...

Dattatreya Accident: చౌటుప్పల్ వద్ద రోడ్డు ప్రమాదం.. గవర్నర్‌ బండారు దత్తాత్రేయకు తృటిలో తప్పిన పెను ప్రమాదం..
Follow us on

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుండి నల్లగొండకు వెళ్తుండగా చౌటుప్పల్ మండలం ఖైతాపురం వద్ద ఆయన కారు రోడ్డు పక్కకు దూసుకు వెళ్లింది. కారు స్టీరింగ్ బిగుసుకుపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నల్లగొండలో జరగనున్న పౌర సన్మానం కార్యక్రమంలో పాల్గొనేందుకు దత్తాత్రేయ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ప్రమాదం అనంతరం దత్తాత్రేయ మరో వాహనంలో నల్లగొండకు బయలుదేరారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Also Read:

CM JAGANA POLAVARAM TOUR: పోలవరం పర్యటనలో సీఎం జగన్ బిజీ బిజీ.. ప్రాజెక్టు పనుల పురోగతిని స్వయంగా పరిశీలించిన ముఖ్యమంత్రి…

ప్ర‌పంచంలో అత్య‌ధికంగా ఏనుగులు మ‌ర‌ణిస్తున్న‌ దేశాల జాబితాలో శ్రీ‌లంక ముందంజ‌.. తాజా నివేదిక‌లు వెల్ల‌డి