ఈఎస్​ఐ పరిధి ఉద్యోగులకు భారీ ఊరట!

| Edited By:

Jun 14, 2019 | 7:54 AM

ఈఎస్​ఐ పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు కేంద్రం శుభవార్త తెలిపింది. ఆరోగ్య బీమాకు సంబంధించి ఉద్యోగుల సభ్యత్వ రుసుంను తగ్గించింది ఆరోగ్య భరోసా కింద వసూలు చేస్తున్న వాటా ప్రస్తుతం ఉన్న 6.5 శాతం నుంచి 4 శాతానికి కుదించింది. ఈఎస్‌ఐ చట్టం ప్రకారం- యజమానులు, కార్మికులూ సంయ్తుంగా ఈ నిధికి కాంట్రిబ్యూట్‌ చేస్తారు. యాజమాన్య వాటాను 4.75 శాతం నుంచి 3.25 శాతానికి, ఉద్యోగుల (కార్మికుల) నుంచి వసూలు చేస్తున్న రుసుమును 1.75శాతం నుంచి 0.75శాతానికి తగ్గిస్తూ […]

ఈఎస్​ఐ పరిధి ఉద్యోగులకు భారీ ఊరట!
Follow us on

ఈఎస్​ఐ పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు కేంద్రం శుభవార్త తెలిపింది. ఆరోగ్య బీమాకు సంబంధించి ఉద్యోగుల సభ్యత్వ రుసుంను తగ్గించింది ఆరోగ్య భరోసా కింద వసూలు చేస్తున్న వాటా ప్రస్తుతం ఉన్న 6.5 శాతం నుంచి 4 శాతానికి కుదించింది. ఈఎస్‌ఐ చట్టం ప్రకారం- యజమానులు, కార్మికులూ సంయ్తుంగా ఈ నిధికి కాంట్రిబ్యూట్‌ చేస్తారు. యాజమాన్య వాటాను 4.75 శాతం నుంచి 3.25 శాతానికి, ఉద్యోగుల (కార్మికుల) నుంచి వసూలు చేస్తున్న రుసుమును 1.75శాతం నుంచి 0.75శాతానికి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ తగ్గింపు జులై 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఇలా ఈఎస్​ఐ రేటును తగ్గించడం 22 ఏళ్లలో ఇదే ప్రథమం. దీని వల్ల 3.6 కోట్ల మంది కార్మికులు, 12.84 లక్షల మంది యజమానులు లాభపడనున్నారు.