ఈఎస్‌ఐ స్కామ్‌ కేసులో రోజుకో ట్విస్టు

ఈఎస్‌ఐ స్కామ్‌ కేసులో రోజుకో ట్విస్టు బయటకొస్తోంది. తాజాగా ఈ కుంభకోణంలో నిందితుల ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసేందుకు ఏసీబీ అనుమతి తీసుకుంది.

ఈఎస్‌ఐ స్కామ్‌ కేసులో రోజుకో ట్విస్టు

Updated on: Sep 08, 2020 | 7:46 PM

ఈఎస్‌ఐ స్కామ్‌ కేసులో రోజుకో ట్విస్టు బయటకొస్తోంది. తాజాగా ఈ కుంభకోణంలో నిందితుల ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసేందుకు ఏసీబీ అనుమతి తీసుకుంది. IMS డైరెక్టర్‌ పద్మ కుటుంబసభ్యులు , బినామీల పేరుమీదున్న 8 కోట్ల 55 లక్షల రూపాయల ఆస్తులు, ఫార్మాసిస్ట్‌ నాగలక్ష్మికి చెందిన 2 కోట్ల 72 లక్షల ఆస్తుల జప్తుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఐఎంఎస్ సంయుక్త సంచాలకురాలు పద్మ, ఫార్మాసిస్టు నాగలక్ష్మి ఆస్తులకు జప్తు చేయనుంది. ఆస్తుల జప్తునకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆస్తుల సీజ్ కి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

 

Loading...
Unable to load recommendations.
Follow Us