నా సంగతేంటి.? రాజాసింగ్ లేఖ

|

Aug 31, 2020 | 9:02 PM

హైదరాబాద్ గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ హోం మంత్రులను వివరణ కోరారు. తనకు ఎవరి నుంచి ప్రాణ హాని ఉందో పోలీసులు స్పష్టంగా తెలపాలని డిమాండ్ చేశారు. అసలు ఎవరి ద్వారా ముప్పు పొంచి..

నా సంగతేంటి.? రాజాసింగ్ లేఖ
Follow us on

హైదరాబాద్ గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ హోం మంత్రులను వివరణ కోరారు. తనకు ఎవరి నుంచి ప్రాణ హాని ఉందో పోలీసులు స్పష్టంగా తెలపాలని డిమాండ్ చేశారు. అసలు ఎవరి ద్వారా ముప్పు పొంచి ఉందో చెప్పకుండా ఈ దోబూచులాట ఏంటని ఆయన ప్రశ్నించారు. తన ‌నియోజకవర్గం ఎక్కువ స్లమ్‌లోనే ఉంది కాబట్టి బండి పైనే ఎక్కువగా తిరుగుతానని రాజాసింగ్‌ పేర్కొన్నారు. స్థానికంగా ముప్పు ఉందా లేక ఇతర ప్రాంతం నుంచి ఉందా అనే విషయం చెప్పాలని కోరారు. తన గన్‌ లైసెన్స్‌ ఫైల్‌ రెండు సంవత్సరాల నుంచి కమిషనర్‌ కార్యాలయంలో పెండింగ్‌లో ఉందని, దీనిని త్వరలోనే అప్‌డేట్‌ చేయాలని రాజాసింగ్‌ కోరారు.

మొహర్రం సందర్భంగా హైదరాబాద్‌లో భారీ ర్యాలీకి ఎలా అనుమతి ఇచ్చారో పోలీసులు, ప్రభుత్వం సమాధానం చెప్పాలని రాజాసింగ్ డిమాండ్‌ చేశారు. గణేష్ ఉత్సవాలను నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వని తెలంగాణ ప్రభుత్వం.. బీబీ కా ఆలం ఊరేగింపునకు ఎలా అంగీకరించిందని ప్రశ్నించారు. ఇలాఉండగా, ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కొందరు ఉగ్రవాదుల నుంచి ప్రాణహాని ఉందని.. జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ ఆయనకు ఆగష్టు 24న లేఖ రాసిన సంగతి తెలిసిందే.